Krack Combo: విజయ్ వద్దన్నాడు.. రవి రమ్మన్నాడు.. జోష్లో గోపీచంద్ మలినేని!

Krack Combination Repeat: వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద చర్చ జరుగుతూ ఉండగా క్రాక్ కాంబో రిపీట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 21, 2023, 05:56 PM IST
Krack Combo: విజయ్ వద్దన్నాడు.. రవి రమ్మన్నాడు.. జోష్లో గోపీచంద్ మలినేని!

Krack Combination Repeats again: వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నందమూరి బాలకృష్ణ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది.

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఈ సినిమాతో వసూళ్ల విషయంలో పోటీ పడడంతో కాస్త వెనకబడినా ఈ సినిమా మాత్రం బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక  వసూళ్లు రాబట్టినట్లే చెప్పాలి. అయితే ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని ఏకంగా విజయ్ తో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. వారసుడు లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చిన విజయ్ కి ఈ మధ్య తెలుగు దర్శకుల మీద కన్ను పడిందని ఆయన తెలుగు దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని ప్రచారం జరిగింది.

Also Read: Kavya Thapar Photos: జంగిల్ సఫారీ చేస్తూ జంగ్లీ ఫోజులు ఇచ్చిన కావ్య థాపర్... హీటు తట్టుకోగలమా?

అందులో భాగంగానే గోపీచంద్ మలినేని చెప్పిన కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా అన్నారు. అయితే తాజాగా అది నిజం కాదని గోపీచంద్ మలినేనికి విజయ్ షాక్ ఇచ్చాడని తేలింది. విజయ్ ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తాజాగా తేలింది. ఈ సినిమా కోసం ఆయన ఎక్కంగా 200 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కూడా అందుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

అయితే గోపీచంద్ మలినేని కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఆయన వెంటనే తన కథను రవితేజకు చెప్పినట్లు తెలుస్తోంది. దానికి రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. నిజానికి కరక్ సినిమాతో రవితేజకు సూపర్ హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. ఈ నేపథ్యంలో అప్పుడు సినిమా నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు తాజా సినిమాని కూడా నిర్మించేందుకు ముందుకు రావడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంటే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ సినిమా త్వరలోనే సిద్ధమవుతుందన్నమాట. 

Also Read: Music Director Raj: టాలీవుడ్లో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News