Manchu Lakshmi - Adiparvam: మంచు లక్ష్మి ఆదిపర్వం.. ఇది మాములుగా లేదుగా..

Manchu Lakshmi - Adiparvam: మంచు లక్ష్మీ.. మోహన్ బాబు కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అడపదడపా ఈ సినిమా కొన్ని సినిమాలు చేస్తూనే ఉంది. ఈ రూట్లో ఈమె యాక్ట్ చేస్తోన్న మరో మూవీ 'ఆదిపర్వం'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు మొదలయ్యాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 4, 2024, 10:58 AM IST
Manchu Lakshmi - Adiparvam: మంచు లక్ష్మి ఆదిపర్వం.. ఇది మాములుగా లేదుగా..

Manchu Lakshmi - Adiparvam: మంచు లక్ష్మీ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఆదిపర్వం'. రావుల వెంకటేశ్వరరావు  సమర్పణలో అన్వికా ఆర్ట్స్ మరియు ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఐదు భాషల్లో నిర్మాణం జరుపుకుంటోంది. సంజీవ్ మేగోటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ హైలెట్‌గా నిలువనున్నాయి.  

'అమ్మెరు', 'అరుంధతి సినిమాల మాదిరిగానే ఇది కూడా హై యాక్షన్ ఫిల్మ్‌గా ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. రీసెంట్‌గా రిలీజైన సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న "హనుమాన్" చిత్రం లాగే ఈ సినిమా కూడా అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రంలో మంచు లక్ష్మి 'నాగలాపురం నాగమ్మ' పాత్రలో కనిపించనున్నట్టు మేకర్స్ తెలిపారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో మంచులక్ష్మి పాత్ర చాలా గొప్పగా ఉంటుందని మంచులక్ష్మితో పాటు ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీరాజేశ్వరి ఇలా చాలా మంచి నటీనటులు తమ తమ పాత్రల్లో అదిరిపోయేలా నటించారన్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ చివరిదశకు చేరుకుందన్నారు. ఒక మంచి ప్రాజెక్టుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మా దర్శకుడు సంజీవ్ మేగోటి అహర్నిశలు కష్టపడుతున్నారని మేకర్స్ తెలియజేసారు.  అలాగే చిత్రంలో నాగమ్మగా పాత్రలో నటిస్తోన్న మంచులక్ష్మి ఎంతో రిస్క్ చేసి రెండు ఫైట్స్ చేశారు. థియేటర్స్‌లో ఆడియన్స్‌కు థ్రిల్‌కు గురిచేస్తాయన్నారు. ఈ చిత్రంలో క్షేత్ర పాలకుడిగా ప్రత్యేక పాత్ర చేస్తున్న శివకంఠంనేని కూడా అద్భుతంగా చేశారన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఇక 'ఆదిపర్"వం గ్రాఫిక్స్ ప్రాధాన్యతతో పాటు కసికొద్దీ పాత్రలో పరకాయప్రవేశం చేసిన నటి మంచు లక్ష్మి ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని ఈ చిత్ర సమర్పకులు రావుల వేంకటేశ్వర రావు అన్నారు.  

ఈ చిత్రంలో నటీనటులు: మంచులక్ష్మీ, శివకంఠంనేని , శ్రీజిత ఘోష్, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా,  వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెటగాంధీ, యోగికాత్రి, గడ్డంనవీన్, ఢిల్లీరాజేశ్వరి, జెమినీ సురేష్, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరాల వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, శిల్పప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్, మృత్యుంజయ శర్మ తదితరులు నటించారు.

ఇదీ చదవండి: Post Office MIS: పోస్ట్ఆఫీస్ బంపర్ ఆఫర్..జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తేచాలు రూ.5 లక్షలు

ఇదీ చదవండి: Investment strategies for girl child: రూ. 4 వేలు పెట్టుబడి పెడితే రూ. 22 లక్షలు! మీ అమ్మాయి కోసం ఈ ప్రత్యేక పథకం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News