Kalki 2898 AD: కీర్తి సురేశ్ ను వదలని నాగ్ అశ్విన్.. మహానటి సెంటిమెంట్ రిపీట్

Keerthy Suresh: మహానటి సినిమాతో సౌత్ ఇండియా మొత్తం తమ వైపు చూసేలా చేసుకున్నారు నాగ్ అశ్విన్, కీర్తి సురేష్. ఇప్పుడు వీరిద్దరూ పాన్ ఇండియా సినిమా పైన కన్నువేశారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 23, 2024, 02:07 PM IST
Kalki 2898 AD: కీర్తి సురేశ్ ను వదలని నాగ్ అశ్విన్.. మహానటి సెంటిమెంట్ రిపీట్

Nag Ashwin - Keerthy Suresh: నాగ్ అశ్విన్ కెరియర్ లో ఎప్పటికీ.. మహానటి సినిమా ఒక అద్భుతమైన చిత్రంగా మిగిలిపోతుంది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. మొదటి చిత్రంతోనే.. మంచి ఎమోషనల్ సినిమాలు చేయగలను అని పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ దర్శకుడి కథ మొత్తం మార్చేసింది మాత్రం మహానటి చిత్రం. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమా.. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక క్లాసిక్ సినిమాగా మిగిలిపోయింది. మొదటి సీన్ నుంచి.. చివరి సీన్ వరకు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.

నాగ్ అశ్విన్ ని ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడుగా మార్చేసింది. అయితే ఈ చిత్రంలో కథ, కథనం, దర్శకత్వం.. ఎంత ముఖ్యమైన పాత్రలు వహించాయో.. కీర్తి సురేష్ కష్టం కూడా అంతే ముఖ్యపాత్ర వహించింది. కీర్తి సురేష్ అద్భుతమైన నటనకు గాను ఈ సినిమా నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించింది అనడం కంటే.. జీవించింది అని చెప్పొచ్చు. మహానటి సినిమా కోసం కీర్తి సురేష్ లావయింది, సన్నమయింది.. నవ్వింది, ఏడ్చింది.. పసిగా కనిపించింది.. వయసు మీద పడిన ఆమెగాను మెప్పించింది. మొత్తం పైన ఈ తరం వారికి సావిత్రి ఎలా ఉంటుంది అంటే.. కీర్తి సురేష్ లాగా ఉంటుంది అనేటట్లు చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ ని తప్ప తెలుగు ప్రేక్షకులు ఎవరిని ఊహించుకోలేరు. అంత గొప్పగా మహానటి పాత్రకు జీవంపోసింది ఈ హీరోయిన్.

తన సినిమాకి ఇంతలా సపోర్ట్ చేసింది కాబట్టే నాగ్ అశ్విన్ కి కూడా కీర్తి సురేష్ పైన ఎంతో గౌరవం ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే మరోసారి ఈ లక్కీ లేడీని తన సినిమాలో.. ఎలాగోలా పెట్టాలి అని దర్శకుడు భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రభాస్ హీరోగా కల్కి 2898AD సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే లాంటి నటులు నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో తన లక్కీ లేడీ కీర్తి సురేష్ కి సైతం ఒక కీలకపాత్ర నాగ్ అశ్విన్ డిజైన్ చేయడం విశేషం. నిన్న ఎంతో ఘనంగా ఈ సినిమాలోని బుజ్జిని కల్కి యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బుజ్జి క్యారెక్టర్ కి ఇంతలా ఒక ఈవెంట్ నిర్వహించారు..అంటే సినిమాలో ఆ పాత్రకి ఉన్న విలువ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఈ బుజ్జి అంటే మరెవరో కాదు కీర్తి సురేష్ అని మనకు టీజర్ చూస్తే అర్థమవుతుంది. కీర్తి సురేష్ మనకు స్క్రీన్ పైన కనిపించక పోయిన బుజ్జి కి వాయిస్ మొత్తం ఈ అమ్మాడి ఇచ్చింది. 

అందుకే టీజర్ లో బుజ్జిని చూసినంత సేపు.. మనకు కీర్తి సురేష్ గుర్తొస్తోంది. సినిమాలో కూడా బుజ్జి క్యారెక్టర్ చాలా సేపు ఉంటుంది కాబట్టి.. మనకి కీర్తి సురేష్ వినిపిస్తూనే ఉంటుంది. మొత్తానికి ఇలా తనకు అచ్చి వచ్చిన కీర్తి సురేష్ ని తన పాన్ ఇండియా సినిమా కల్కిలో సైతం కీలకపాత్రలో తీసుకునేశారు దర్శకుడు. మరి ఈ సినిమా కూడా మహానటి లాగా బ్లాక్ బస్టర్ అవుతుందేమో వేచి చూడాలి.

Also Read: Iqoo Z9X 5G: మొదటి సేల్‌లో Iqoo Z9X మొబైల్‌పై భారీ తగ్గింపు.. ధర చూస్తే కొనడం ఖాయం!

Also Read: Google Pay Close: అలర్ట్.. గూగుల్‌ పే సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News