NTR - Tillu Square Success Meet: దేవర అభిమానుల అంచనాలకు మించి ఉంటుంది.. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

NTR - Tillu Square Success Meet: దేవర సినిమా అభిమానుల అంచనాలకు మించి ఉంటుంది. అంతేకాదు ఆలస్యమైనా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉంటుందని టిల్లు స్వ్కేర్ సక్సెస్‌ మీట్‌లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 9, 2024, 08:17 AM IST
NTR - Tillu Square Success Meet: దేవర అభిమానుల అంచనాలకు మించి ఉంటుంది.. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

NTR - Tillu Square Success Meet: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'.  డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈసినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడు. మరోవైపు సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు.. దాదాపు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. హనుమాన్ తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ శిల్పా కళా వేదికలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అథితిగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ వేడుకలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పాటు విశ్వక్‌సేన్ కూడ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్.. ఈ సినిమా సక్సెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

సిద్దును ఎపుడు కలవలేదు. కరోనా తర్వాత కలిశాను.  టిల్లు సినిమా చూసిన తర్వాత అతను బయట కూడా అలాగే ఉంటాడని ఊహించుకున్నాను. కానీ అతనికి సినిమా తప్ప మరో ధ్యాస లేదు. ఈ సినిమా చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేకపోయాను. ఇలాంటి అద్భుతమైన పాత్రలను ఎన్నో సిద్దు చేయాలని కోరుకుంటున్నాన్నారు.

ఈ సందర్భంగా దేవర సినిమా గురించి మాట్లాడారు ఎన్టీఆర్. అంతేకాదు ఈ సినిమా లేటైనా.. అభిమానులు కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. అంతేకాదు ఈ వేదికగా దేవర సినిమా డైలాగ్ చెప్పారు. 'కల కనడానికి ఓ ధైర్యం ఉండాలి. ఆ కలను సార్ధకం చేసుకోవడానికి భయం ఉండాలి'.   టిల్లు స్క్వేర్ బృందం భయపడుతూ .. ఎంతో శ్రద్ధతో తెరకెక్కించడం వలన ఈ సినిమా ఇంత బాగా వచ్చిందన్నారు. అందరికీ కష్టం ఒక్కటే. అందరు కష్టాన్ని నమ్ముకోవాలి. విశ్వక్ సేన్, సిద్దులపై తనకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ఈ వేడుకలో అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు మల్లిక్ రామ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.

Also Read: Shobha Karandlaje: ప్రచారంలో అపశ్రుతి.. కేంద్ర మంత్రి కారు తగిలి కార్యకర్త మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News