ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ; అదనపు డేటా, వ్యాలిడిటీ

                                                  

Last Updated : Jun 4, 2018, 11:40 PM IST
ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ; అదనపు డేటా, వ్యాలిడిటీ

యూజర్ల మెప్పు కోసం ఎయిర్ టెల్ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. కేవలం రూ.399 ప్లాన్ తో రోజూ రూ.2.4 జీబీ డేటా 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. గతంలో ఈ ప్యాకేజీలో రోజూ 1.4 జీబీ 70 రోజుల వ్యాలిడిటీతో ఉండేది.ప్రస్తుతం జియోతో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఎయిర్ టెల్ ఈ మేరకు తాయిలాలు ప్రకటించింది.  ఇక అపరిమిత కాల్స్ , ప్రతి రోజూ 100 వరకు ఉచితంగా ఎస్ఎంఎస్ లు కూడా యూజర్లు యధాతథంగా పొందొచ్చు.   

జీయోకు ధీటుగా ..
రిలయన్స్ జియో రూ.399 ప్లాన్ లో ప్రతి రోజూ అందిస్తున్న ఉచిత డేటా 1.5 జీబీ ఇస్తోంది. దీనికి పోటీగా ఎయిర్ టెల్ తన ప్లాన్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించనుంది.  కష్టమర్లకు ఎస్ఎంఎస్ ల ద్వారా సమచారాన్ని అందిస్తోంది ఎయిర్ టెల్. ఇంకెందుకు ఆలస్యం ఎయిర్ టెల్ కష్టమర్ అయితే మీ ఎస్ఎంఎస్ ఇన్ బాక్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి.

Trending News