20 ఏళ్ల తర్వాత బాలీవుడ్ జంట బ్రేకప్

బాలీవుడ్‌లో అందమైన జంటగా పేరు సంపాదించుకున్న అర్జున్ రామ్‌పాల్‌, మోడల్‌ మెహర్‌ జెస్సియా‌లు 20 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ అందమైన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నామని వారు తెలిపారు. 

Last Updated : May 28, 2018, 09:33 PM IST
20 ఏళ్ల తర్వాత బాలీవుడ్ జంట బ్రేకప్

బాలీవుడ్‌లో అందమైన జంటగా పేరు సంపాదించుకున్న అర్జున్ రామ్‌పాల్‌, మోడల్‌ మెహర్‌ జెస్సియా‌లు 20 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ అందమైన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నామని వారు తెలిపారు. లక్ష్యాలు వేరుగా ఉన్నాయని భావించినప్పుడు.. భార్యభర్తలు కూడా విడిపోతేనే మంచిదనేది తమ ఉద్దేశమని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.

అయితే తమ పిల్లల పట్ల ప్రేమ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుందని వారు ప్రకటించారు. 1998లో ప్రేమ వివాహం చేసుకొని.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా పేరుగాంచిన అర్జున్ రామ్ పాల్, మోహర్‌ల బ్రేక్ అప్ చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వీరికి మహికా, మైరా అనే ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. 

తాము విడిపోతున్న విషయాన్ని ఈ జంట సోషల్ మీడియా ద్వారా తెలిపింది. బంధాలు తెగిపోవచ్చు గానీ.. ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుందని కూడా ఈ జంట సందేశమిచ్చింది. ఇది తమ ప్రైవసీకి సంబంధించిన అంశమని.. అందుచేత భవిష్యత్తులో ఇదే అంశంపై ఎలాంటి కామెంట్స్ ఉండవని కూడా ఈ జంట తెలిపింది. 

Trending News