రాజేంద్రప్రసాద్‌కి అరుదైన పురస్కారం

చరిత్ర సృష్టించిన నటుడు రాజేంద్రప్రసాద్

Last Updated : Sep 19, 2018, 09:58 AM IST
రాజేంద్రప్రసాద్‌కి అరుదైన పురస్కారం

హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. నటుడిగా విశిష్ట సేవలు అందించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. మంగళవారం సిడ్నీ పార్లమెంట్ హాలులో ఆస్ట్రేలియా సాంస్కృతిక శాఖ తరఫున ఏడుగురు ఎంపీల బృందం రాజేంద్రప్రసాద్‌ను ఘనంగా సన్మానించి ఈ అవార్డుతో సత్కరించింది. సిడ్నీ పార్లమెంట్ హాలులో జరిగిన ఈ అట్టహాస వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

భారతదేశం నుండి ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న మొట్టమొదటి నటుడు రాజేంద్రప్రసాద్ కావడం విశేషం. రెండు నెలల క్రితం న్యూజెర్సీ అసెంబ్లీ కూడా రాజేంద్రప్రసాద్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది.

రాజేంద్రప్రసాద్ సినీ జీవితంలో దాదాపు 240 సినిమాల్లో నటించారు. ఎర్రమందారం, ఆ నలుగురు చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌‌తో ఆయన్ను సత్కరించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు..తాను రాజేంద్రప్రసాద్‌కు అభిమానినని పలు సందర్భాల్లో చెప్పారు. క్విక్ గన్ మురుగన్ అనే చిత్రంలో హాలీవుడ్‌లోనూ మెప్పించారు రాజేంద్రప్రసాద్.

Trending News