అంతరిక్షం సినిమాపై అంచనాలు పెంచిన మాస్ అమ్మా మాస్ ప్రోమో

అంతరిక్షం సినిమాపై అంచనాలు పెంచిన మాస్ అమ్మా మాస్ ప్రోమో

Last Updated : Dec 20, 2018, 03:24 PM IST
అంతరిక్షం సినిమాపై అంచనాలు పెంచిన మాస్ అమ్మా మాస్ ప్రోమో

'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్, అతిథి రావు హైదరి, లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అంతరిక్షం సినిమా రేపే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు భారీ స్పందన కనిపించగా తాజాగా మేకర్స్ మాస్ అమ్మా మాస్ అనే మరో ప్రోమోను విడుదల చేశారు. భారత్‌లో అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కిన మొదటి సినిమా ఇదే అని చెబుతూ మేకర్స్ రూపొందించిన ఈ ప్రోమో అంతరిక్షం మూవీపై మరిన్ని అంచనాలను పెంచింది. గంటకు 9000 కిమీ అనే ట్యాగ్ లైన్ సైతం సినిమాపై ఇంకొంత క్యూరియాసిని పెంచింది. తన మొదటి సినిమా ఘాజీని సముద్ర గర్భంలో యుద్ధం నేపథ్యంతో తెరకెక్కించిన యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి, తన రెండో సినిమా 'అంతరిక్షం'ను అంతకన్నా ఎక్కువ ఆసక్తికరంగా రూపొందించారనే అంచనాలు కలిగేలా చేసింది ఈ ప్రోమో.   

Trending News