తక్షణ శక్తినిచ్చే సగ్గుబియ్యం

Last Updated : Oct 25, 2017, 12:27 PM IST
తక్షణ శక్తినిచ్చే సగ్గుబియ్యం

బయటి నుంచి ఇంటికి రాగానే ఏదైనా తినాలని అనిపిస్తుంది. భోజనం టైం కాకపోతే ఏదైనా స్నాక్స్ తో సర్దుకుంటాం. భోజన సమయానికి ప్లేట్ ముందు కూర్చుంటాం.. కానీ ఆకలి కాదు. ఈ సమస్య సహజంగా అందరికీ ఉండేదే..! స్నాక్స్ తీసుకుంటే త్వరగా ఆకలి కాదు. అవి జీర్ణం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో సగ్గుబియ్యం తింటే త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి శక్తి అందుతుంది. 

* నిజానికి సగ్గుబియ్యాన్ని పరిశ్రమల్లో తయారుచేస్తారు. అధికంగా తమిళనాడు (70%), కేరళ, ఆంధ్ర ప్రదేశ్ (30%) ఉత్పత్తిచేస్తాయి. తక్కువ కేలరీలతో ఎక్కువ శక్తినిచ్చే ఆహారం సగ్గుబియ్యం.   ఇందులో కార్బొహైడ్రేడ్లు అధికంగా ఉంటాయి. అందుకే శక్తినిచ్చే శీతలపానీయాలలో, బ్రెడ్‌ ఐటమ్స్‌లో వీటిని అధికంగా ఉపయోగిస్తారు.

* ఆఫీస్ నుండి ఇంటికి అలసటతో వస్తుంటారు. అలాంటప్పుడు సగ్గుబియ్యం వంటలు బాగా ఉపయోగపడతాయి. అందులో ఒకటి  సబుదాన సలాడ్‌. దీని వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. తక్షణ ఎనర్జీ లభిస్తుంది.

* పిండి పదార్ధం ఎక్కువగా ఉండటం.. రసాయనాలు, తీపి పదార్థాలు లేకపోవడం వల్ల సగ్గుబియ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి, షుగర్ పేషంట్లు ఈ ఆహారాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. 

* తెల్ల సగ్గుబియ్యం గింజలతో వడలు, కిచిడీ, పాయసం లాంటి వంటలు చేసుకోవచ్చు. వీటిని చేసుకోవడం కూడా సులభమే. 

* సగ్గుబియ్యాన్ని నీటిలో ఉడికించి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు రావు. పిల్లలకు పంచదార కలిపి ఇవ్వండి. 

* బలహీనంగా ఉన్నవారికి సగ్గుబియ్యం ఇస్తే, బలహీనత తగ్గి తక్షణ శక్తి అందుతుందని వైద్యులు చెబుతారు. 

* పోషకాలు, విటమిన్లు, కాల్షియం, ఐరన్, పీచు పదార్థాలు సగ్గుబియ్యంతో ఉంటాయి. కనుక, అన్ని వయసులవారు, పిల్లలు సగ్గుబియ్యం తీసుకోవచ్చు.  

Trending News