India: ఒక్కరోజే కోలుకున్న 19,235 మంది బాధితులు

CoronaVirus cases In India | భారత్‌లో కరోనా మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు కోవిడ్19 పాజిటివ్ సంఖ్య పెరుగుతోంది, అయితే కరోనా నుంచి రికవరీ రేటు స్థిరంగా ఉండటమే దేశంలో ఊరట కలిగించే అంశం. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసింది.

Last Updated : Jul 12, 2020, 11:20 AM IST
India: ఒక్కరోజే కోలుకున్న 19,235 మంది బాధితులు

India CoronaVirus Cases | దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గ‌త వారం రోజులుగా దాదాపు 25వేలు, లేక అంతకన్నా ఎక్కవ కోవిడ్19 కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో 28,637  కరోనా పాజిటివ్ కేసులను వైద్యులు నిర్ధారించారు. వీటితో కలిపి దేశంలో మొత్తం కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య (India COVID19 Cases) 8,49,553కు చేరింది. తొలిసారిగా మాస్క్ ధరించిన డొనాల్డ్ ట్రంప్

అదే సమయంలో రికార్డు స్థాయిలో 551 మంది ప్రాణాలు కోల్పోయారు. జులై 12 (ఆదివారం) ఉదయం నాటికి భారత్‌లో మొత్తం కోవిడ్19 మరణాల సంఖ్య 22,674 అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 19,235 మంది కోవిడ్19 నుంచి కోలుకోవడం గమనార్హం. భారత మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్

మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం ప్రాణాంతక కరోనా మహమ్మారి బారి నుంచి 5,34,621 మంది కోలుకుని ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ కాగా, ప్రస్తుతం 2,92,258 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు 62.7గా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని నగరాలలో మళ్లీ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధిస్తున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News