ఉగ్రవాదుల సందట్లో సడేమియా..!!

దేశమంతా 'కరోనా వైరస్'ను ఎదుర్కునే పనిలో బిజీగా ఉంది. కరోనా వైరస్ నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి జనం నానా తిప్పలు పడుతున్నారు. ఇదే అదనుగా ఉగ్రవాదులు తమ పని చేసుకోవాలని భావిస్తున్నారు.

Last Updated : Mar 23, 2020, 01:12 PM IST
ఉగ్రవాదుల సందట్లో సడేమియా..!!

దేశమంతా 'కరోనా వైరస్'ను ఎదుర్కునే పనిలో బిజీగా ఉంది. కరోనా వైరస్ నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి జనం నానా తిప్పలు పడుతున్నారు. ఇదే అదనుగా ఉగ్రవాదులు తమ పని చేసుకోవాలని భావిస్తున్నారు. 

ఈ క్రమంలో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు.. భారత దేశంలో పెద్ద ఉగ్రవాద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తూ ..పెద్ద ఎత్తున దాడులకు కుట్ర పన్నినట్లు అర్థమవుతోంది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు ..పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా  చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని సోపోర్ జిల్లాల్లో ఈ ఘటన జరిగింది. 

10 నిముషాల్లోనే ''కరోనా వైరస్'' పరీక్ష..!!

ప్రస్తుతం నలుగురు వ్యక్తులను పోలీసులు విచారణ చేస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు..? ఎవరికి ఆయుధాలు సరఫరా చేస్తున్నారు..? ఎవరు వారి వెనుక ఉన్నారు..? ఆయుధాలను ఎక్కడికి తీసుకు వెళ్తున్నారు..? ఆయుధాలతో ఎలాంటి కుట్రలకు ప్లాన్ చేశారు..? అనే విషయాలు  తెలుసుకుంటున్నారు. ఐతే తామంతా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ కోసం పని చేస్తున్నామని వారు ఒప్పుకున్నారు. కొత్తగా  ఏర్పడిన TRF,JK ఫైటర్స్ అనే ఉగ్రవాద సంస్థ కోసం పని చేస్తున్నట్లు తెలిపారు. మిగతా విషయాలు  వారి నుంచి రాబట్టాల్సి ఉంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News