'కరోనా'పై మూకుమ్మడిగా పోరాడుదాం..!!

'కరోనా'పై మూకుమ్మడిగా పోరాడుదాం..!! సామూహిక యుద్ధం చేద్దాం. ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ... అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇచ్చిన పిలుపు. క్షేత్రస్థాయిలో మూకుమ్మడి పోరాటమే .. మహమ్మారి పారిపోవడానికి బీజం వేస్తుందని స్పష్టం చేశారు ప్రధాని. 

Last Updated : Apr 2, 2020, 05:17 PM IST
'కరోనా'పై మూకుమ్మడిగా పోరాడుదాం..!!

'కరోనా'పై మూకుమ్మడిగా పోరాడుదాం..!! సామూహిక యుద్ధం చేద్దాం. ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ... అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇచ్చిన పిలుపు. క్షేత్రస్థాయిలో మూకుమ్మడి పోరాటమే .. మహమ్మారి పారిపోవడానికి బీజం వేస్తుందని స్పష్టం చేశారు ప్రధాని. 

ఇందుకోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్నట్లుగానే భావించాలన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ ప్రాంతాల్లో మత పెద్దలను ఆహ్వానించి కరోనా వైరస్ పై పోరాటాన్ని వివరించాలని కోరారు. తమ తమ మతాల్లో వ్యక్తులను కరోనా మహమ్మారిపై యుద్ధంలో భాగస్వామ్యులను చేయాల్సిందిగా కోరాలన్నారు. అలాంటప్పుడే మహమ్మారి లొంగి వస్తుందన్నారు.  కరోనా వైరస్ మన సంస్కృతిపై, మన విశ్వాసాలపై దెబ్బ  కొట్టిందన్నారు. అలాంటి మహమ్మారిపై మనమే యుద్ధం గెలవాలని పిలుపునిచ్చారు...

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News