చెన్నై పట్టణంలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ యాక్సిడెంట్ లో తెలుగమ్మాయిలు భవాని, లక్ష్మి మరణించారు. కాగా ఈ ప్రమాదంలో శివ అనే యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
ప్రమాదం జరిగిందిలా..!!
ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు చెన్నైలో ఉంటున్న భవాని, లక్ష్మి తమ స్నేహితుడు శివ తో కలిసి బైక్ పై కాలేజీకి వెళుతుండగా. వెనుక నుంచి వచ్చిన మరో బైక్ బలంగా ఢీకొట్టింది. దాంతో శివ తన బైక్ ను కంట్రోల్ చేయలేకపోవడంతో ముగ్గురూ కింద పడిపోయారు.సరిగ్గా అదే సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా దూసుకొస్తున్న బస్సు వారిని ఢీకొనడంతో భవాని, లక్ష్మి ప్రాణాలు కోల్పోగా.. శివ తీవ్ర గాయాలపాలయ్యాడు.
మృతులు రాజమండ్రి వాసులు !!
ప్రముఖ మీడియా కథనం ప్రకారం మృతులు భవానీ, నాగలక్ష్మి, శివ గా రాజమండ్రికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చెన్నైలోని తాంబారంలోని వీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. మంగళవారం ముగ్గురూ కలిసి ఒకే బైక్పై తాంబారంలోని కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ప్రమాదంలో గాయపడ్డ శివను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం.