ఆ చెంపదెబ్బ ఖరీదు కోటి రూపాయలు

యాదవ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని బెదిరించారని... ఆయన క్షమాపణ చెప్పకపోతే ఊరుకొనేది లేదని ఇప్పటికే సహానీ తెలిపారు.

Last Updated : Nov 25, 2017, 03:38 PM IST
ఆ చెంపదెబ్బ ఖరీదు కోటి రూపాయలు

బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీకి మీడియా ప్రతినిధిగా పనిచేస్తున్న అనిల్ సహాని, ఆర్జేడీ నేత మరియు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పై విమర్శలు గుప్పించారు. బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సుశీల్ కుమార్ మోడీపై బెదిరింపు వ్యాఖ్యలు చేసిన తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఎవరు చెంపదెబ్బ కొడతారో వారికి కోటి రూపాయలు బహుమతిని ఇస్తానని సహాని చెప్పడం రాష్ట్రంలో దుమారం లేపింది. అయితే సహానీ వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధికార వర్గం వెల్లడించింది. ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకుంటామని కూడా తెలిపింది. యాదవ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని బెదిరించారని... ఆయన క్షమాపణ చెప్పకపోతే ఊరుకొనేది లేదని ఇప్పటికే సహానీ తెలిపారు. సుశీల్ మోడీ కుమారుడి పెళ్ళికి వచ్చి మరీ కొడతానని యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సహానీ మాటలు అతని వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ రుంగ్టా ఇప్పటికే తెలిపారు. ఆ విషయంపై ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. 

Trending News