పాఠశాలలో పేలుడు.. 12 మంది విద్యార్థులకు గాయాలు!

పాఠశాలలో పేలుడు.. 12 మంది విద్యార్థులకు గాయాలు!

Last Updated : Feb 13, 2019, 04:30 PM IST
పాఠశాలలో పేలుడు.. 12 మంది విద్యార్థులకు గాయాలు!

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు నర్బల్ ప్రాంతంలోని ఫలై-ఏ-మిల్లత్ అనే ప్రైవేటు పాఠశాలలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి స్థిమితంగానే వుందని పుల్వామా జిల్లా పోలీసులు తెలిపారు.  

పాఠశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

Trending News