Fatty Liver Disease: ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడుతున్నారా, రోజు మద్యం తాగేవారు తప్పకుండా పాటించే చిట్కా

Ayurvedic Medicine For Fatty Liver: అశ్వగంధ చూర్ణాన్ని ప్రతి రోజు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల ఫ్యాటీ లివర్‌ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 16, 2023, 12:37 PM IST
Fatty Liver Disease: ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడుతున్నారా, రోజు మద్యం తాగేవారు తప్పకుండా పాటించే చిట్కా

Ayurvedic Medicine For Fatty Liver: ఆధునిక జీవనశైలి కారణంగా అమ్మాయిలు, అబ్బాయిలని తేడా లేకుండా అందరూ ఆల్కహాల్ సేవిస్తున్నారు. దీని కారణంగా  కాలేయంతో పాటు శరీరంలో టాక్సిన్స్‌ పేరుకుపోతున్నాయి. దీంతో చాలా మంది అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా కొందరిలో కాలేయం దెబ్బ తిని,  ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కాలు పాటించడం వల్ల కూడా ఈ చిట్కా నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఫ్యాటీ లివర్‌ సమస్యలతో బాధపడేవారు ఎలాంటి ఆయుర్వేద మూలికలను వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అశ్వగంధ చూర్ణం:
అశ్వగంధ చూర్ణానికి ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే  ఔషధ గుణాలు ఫ్యాటీ లివర్‌ సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు, ఫ్యాటీ లివర్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు గోరు వెచ్చని నీటిలో అశ్వగంధ చూర్ణం కలుపుకుని తాగాల్సి ఉంటుంది. 

అశ్వగంధ చూర్ణం వల్ల కలిగే లాభాలు:
ఫ్యాటీ లివర్‌ సమస్యకు చెక్‌:

ప్రతి రోజు ఆల్కహాల్ సేవించేవారిలో ఫ్యాటీ లివర్‌ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా క్రమంగా కాలేయం దెబ్బ తినే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి రెగ్యులర్ అశ్వగంధ పొడిని పాలలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు రక్తపోటు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. 

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

కాలేయం ఆరోగ్యంగా మారుతుంది:
కాలేయం దెబ్బతినడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పటికే కాలేయం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు అశ్వగంధ చూర్ణాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు తీవ్ర వ్యాధులకు చెక్‌ పెడతాయి. అంతేకాకుండా కాలేయాన్ని రక్షించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. 

టాక్సిన్స్ నుంచి ఉపశమనం:
అతిగా మద్యపానం సేవించేవారిలో, అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినేవారిలో కాలేయంలో తరచుగా టాక్సిన్స్ పేరుకుపోవడం సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి  అశ్వగంధ చూర్ణాన్ని గోరు వెచ్చని పాలు లేదా నీటిలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News