/telugu/photo-gallery/daggubati-purandeswari-demands-to-ys-jagan-must-give-declaration-while-visiting-tirumala-temple-on-28th-september-rv-167258 YS Jagan Declaration: తిరుమలలో వైఎస్‌ జగన్‌ అడుగు పెట్టాలంటే అది చేయాల్సిందే! పురంధేశ్వరి ఛాలెంజ్‌ YS Jagan Declaration: తిరుమలలో వైఎస్‌ జగన్‌ అడుగు పెట్టాలంటే అది చేయాల్సిందే! పురంధేశ్వరి ఛాలెంజ్‌ 167258

Diabetes tips: ఆధునిక జీవన విదానంలో ఎదురయ్యే పలు వ్యాదుల్లో అత్యంత ప్రమాదకరమైంది డయాబెటిస్. రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో లేకుంటే ఇతర చాలా వ్యాధులు తలెత్తుతాయి. శరీరంలోని వివిద అంగాలపై ప్రభావం పడుతుంటుంంది. జీవనశైలిలో మార్పుతో డయాబెటిస్ వ్యాధి నియంత్రించవచ్చంటున్నారు.

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి డయాబెటిస్. ఈ ఒక్క వ్యాది ఎన్నో ఇతర వ్యాదులకు కారణమౌతుంటుంది.రక్తంలో చక్కర శాతం విపరీతంగా పెరిగిపోతుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో చాలా రకాల మందులు, ఇతర పద్దతులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోజువారీ ఆహారంలో అత్యంత కీలకమైన భాగం ఉదయం తీసుకునే అల్పాహారం. రోజూ మీరు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మిమ్మల్ని ఆ రోజుకు సిద్ధం చేస్తుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యంగా ఉండాలంటారు. బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యంగా ఉంటే శరీరం మెటబోలిజం వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా శరీరానికి కావల్సిన ఎనర్జీ అందిస్తుంది. బ్లడ్ షుగర్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. అందుకే ఉదయం వేళ పైబర్ ఫుడ్స్  తీసుకోవడమే కాకుండా తీసుకునే సమయం కూడా సరైందిగా ఉండాలి.

రోజూ ఉదయం లేచిన తరువాత 2 గంటల్లోగా బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయాల్సి ఉంంటుంది. ఉదయం త్వరగా లేస్తే బ్రేక్‌ఫాస్ట్ కూడా త్వరగా పూర్తవాలి. ఎందుకంటే ఉదయం లేచిన తరువాత త్వరగా బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేస్తే మెటబోలిజం వేగవంతమౌతుంది. అందుకే ఉదయ 7-8  గంటల మధ్య బ్రేక్ ఫాస్ట్ అయిపోవాలి. ఉదయం 10 గంటల వరకూ బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఉండటం మంచిది కాదు. 

రోజూ క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండేందుకు అవకాశముంటుంది. అంటే క్రమబద్ధంగా డైట్ ఉంటే డయాబెటిస్ వృద్ధి చెందకుండా ఉంటుంది. సరైన సమయంలో బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల మానసికంగా కూడా బాగుంటుంది. పని చేసే సామర్ధ్యం, ఏకాగ్రత పెరుగుతాయి. డయాబెటిస్‌తో బాధపడేవాళ్లు నిద్ర పూర్తిగా ఉండేట్టు చూసుకోవాలి. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అలవాటు చేసుకోవాలి. 

18 ఏళ్లు నిండితే బ్లడ్ షుగర్ స్థాయి 140 వరకు ఉండాలి. ఇది భోజనం తరువాత ఉండాల్సిన లెవెల్. ఇక పరగడుపున ఉండాల్సిన బ్లడ్ షుగర్ లెవెల్ 99 వరకూ ఉండాలి. ఇక 40-50 ఏళ్ల మధ్యలో అయితే ఫాస్టింగ్ షుగర్ 130 ఉండాలి. బోజనానంతరం అయితే 150 వరకూ ఉండవచ్చు..

Also read: Skin Care Tips: వర్షాకాలంలో మొటిమల సమస్య బాధిస్తోందా, రోజూ ఇలా ఈ చిట్కాలు పాటిస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Health tips and precautions for diabetes partients do complete breakfast before 8am will reduce blood sugar levels
News Source: 
Home Title: 

Diabetes tips: ఉదయం 8 గంటల్లోగా బ్రేక్‌ఫాస్ట్ తింటే మధుమేహం తగ్గిపోతుందా, వైద్యులేమం

Diabetes tips: ఉదయం 8 గంటల్లోగా బ్రేక్‌ఫాస్ట్ తింటే మధుమేహం తగ్గిపోతుందా, వైద్యులేమంటున్నారు.
Caption: 
Diabetes Tips ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Diabetes tips: ఉదయం 8 గంటల్లోగా బ్రేక్‌ఫాస్ట్ తింటే మధుమేహం తగ్గిపోతుందా, వైద్యులేమం
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, July 23, 2023 - 23:49
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
36
Is Breaking News: 
No
Word Count: 
298