సస్పెన్స్ రేపుతున్న అనసూయ పోస్టర్

సస్పెన్స్ రేపుతున్న అనసూయ పోస్టర్

Last Updated : Mar 7, 2019, 12:32 PM IST
సస్పెన్స్ రేపుతున్న అనసూయ పోస్టర్

ఓవైపు బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం కథనం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాదే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమాను రాజేష్ నాదెండ్ల డైరెక్ట్ చేస్తుండగా ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో గాయత్రి ఫిలింస్ బ్యానర్‌పై బట్టిపాటి నరేంద్రా రెడ్డి, శర్మ చుక్క నిర్మిస్తున్నారు. అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తుండగా శ్రీనివాస్ అవసరాల, ధనరాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రేపు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్టు స్వయంగా అనసూయనే ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ వేసవి సెలవుల్లో సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

కథనం మూవీ టైటిల్ లోగోను పరిశీలించి చూస్తే, అనసూయ ఈ సినిమాలో ఒక పాత్రికేయురాలిగానో లేక రచయిత్రిగానో పనిచేస్తుండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సస్పెన్స్‌కి తరపడాలంటే, రేపు కథనం టీజర్ విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.

Trending News