ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతి, ముగ్గురికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంతనాగ్‌లోని కేపీ రోడ్‌లో వున్న ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌కి సమీపంలో బి/116 బెటాలియన్ ట్రూప్స్‌పై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు ఈ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నారు.

Last Updated : Jun 12, 2019, 07:25 PM IST
ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతి, ముగ్గురికి గాయాలు

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంతనాగ్‌లోని కేపీ రోడ్‌లో వున్న ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌కి సమీపంలో బి/116 బెటాలియన్ ట్రూప్స్‌పై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు ఈ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. రెండు వాహనాలపై మాస్కులు ధరించి వచ్చిన ఉగ్రవాదులు జవాన్లపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. 

పాకిస్తాన్‌కు చెందిన అల్-ఉమర్ ముజహిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే బాధ్యులం అని ప్రకటించుకుంది. ఘటనాస్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

Trending News