Tragedy Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలో కారు బోల్తా ఏడుగురు దుర్మరణం

Car Plunges Into Canal 7 Life Ends: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా  శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామం వద్ద జరిగింది.

1 /6

తెలంగాణలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రత అక్కడ భయానక దృశ్యాలు గగుర్పొడిచాయి.

2 /6

రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి అతివేగంగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

3 /6

ఈ సంఘటన మెదక్ జిల్లా  శివంపేట మండలం ఉసిరికపల్లి - రత్నాపూర్‌ గ్రామాల సమీపంలో చోటుచేసుకుంది.

4 /6

ఎగిరి కాలువలోకి దూసుకెళ్లడంతో కారు నీటిలో మునిగింది. కారులో ఉన్న ఏడుగురు చిక్కుకున్న వారు నీటిలో మునిగి మృతి చెందారు.

5 /6

మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు, ఓ వ్యక్తి ఉన్నారు. మృతులంతా పాముబండ తండాకు చెందిన వారిగా గుర్తించారు.

6 /6

గుంతను తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.