Allu Arjun: కేసు కొట్టేయండి.. ఏపీ హైకోర్టుకు అల్లు అర్జున్..

Allu Arjun: తెలుగు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. 2024 మే 11న నంద్యాలలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర తరుపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో ఈ ఎన్నికల ర్యాలీకి అనుమతులు లేకపోవడంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది.

1 /5

Allu Arjun:  అల్లు అర్జున 2024 ఏపీలో అసెంబ్లీలో పాటు పార్లమెంట్ కు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తన మావయ్య జనసేనకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించినా.. నంద్యాలలో మాత్రం తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన శిల్పా రవిచంద్రకు సపోర్ట్ గా నిలిచి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి శిల్పారవి కానీ, అల్లు అర్జున్ తరపున కాని ఎవరు ముందస్తు అనుమతి తీసుకోలేదు. దీంతో స్థానిక వీఆర్వో ఈ విషయమై సీరియస్ అయ్యారు.

2 /5

అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ జరిగిందని పోలీసులకు కంప్లైంట్  చేశారు. దీంతో అల్లు అర్జున్‌తోపాటు శిల్పా రవిపై సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలును ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే అప్పట్లో ఆ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

3 /5

ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. రేపు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

4 /5

అప్పట్లో అల్లు అర్జున్.. తన మావయ్య జనసేనకు సపోర్ట్ చేస్తానంటూనే వైసీపీకి చెందిన తన ఫ్యామిలీ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర రెడ్డి తరుపున ఎన్నికల ప్రచారం  నిర్వహించడంపై పవన్ అభిమానులు .. అల్లు అర్జున్ తీరుపై ఇప్పటికీ గుర్రుగా ఉన్నారు.

5 /5

అల్లు అర్జున్ విషయానికొస్తే.. త్వరలో ‘పుష్ప 2’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్యాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలే ఉన్నాయి.