ప్రాణాలు తీసిన ఈత సరదా.. మూడు కుటుంబాలలో విషాదం

తెలిసి తెలియని వయసులో సరదా పేరిట ఇబ్బంతులు తలెత్తే ప్రదేశాలకు పిల్లలు, చిన్నారులు వెళ్తుంటారు. లోతు తెలియక Swimmingకు దిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. తల్లిదండ్రులకు అది శాపంగా మారుతుంది.

Last Updated : Jun 19, 2020, 10:02 AM IST
ప్రాణాలు తీసిన ఈత సరదా.. మూడు కుటుంబాలలో విషాదం

ఈత (Swimming) సరదా మూడు కుటుంబాలలో పెను విషాదాన్ని నింపింది. ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు రిజర్వాయర్‌లో గల్లంతయ్యారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి... రామారం గణేష్ నగర్‌కు చెందిన మన్విత్ కుమార్(11), మహేష్ బాబు(14), విష్ణు(14) స్థానిక రామారం రిజర్వాయర్‌కు ఈతకు వెళ్లారు. హాట్ ఫొటోలతో యాంకర్ Varshini రచ్చరచ్చ!

ఈ క్రమంలో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లు రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లు కొన్ని గంటలపాటు శ్రమించి ముగ్గురు బాలుర మృతదేహాలను వెలికితీశారు. ఈతకు వెళ్లిన తమ పిల్లలు మృతదేహాలుగా కనిపించడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News