రేపు 'ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు'ను ప్రారంభించనున్న రాష్ట్రపతి

డిసెంబరు 27న ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో  'ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు' ను రాష్ట్రపతి రాంనాథ్  కోవింద్ ప్రారంభిస్తారు.

Last Updated : Dec 26, 2017, 05:30 PM IST
రేపు 'ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు'ను ప్రారంభించనున్న రాష్ట్రపతి

డిసెంబరు 27న ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో  'ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు' ను రాష్ట్రపతి రాంనాథ్  కోవింద్ ప్రారంభిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ లో హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం విస్తరించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'ఏపీ ఫైబర్ గ్రిడ్' అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 1.45 కోట్ల కుటుంబాలు, 12,198 పంచాయితీలు, 60,000 పాఠశాలలను కవర్ చేయాలని ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, 96 మునిసిపాలిటీలు, 14 కార్పొరేషన్లు, 6,000 పబ్లిక్ హెల్త్ కేంద్రాలకు ఇంటర్నెట్ సదుపాయాలను కూడా అందిస్తుంది.

హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాల వినియోగం నెలకు రూ.149 మాత్రమే. రియల్-టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) సెంటర్ కు అనేక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆసియాలో అతిపెద్ద వీడియో వాల్.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్, రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) అయిన బాబు మాట్లాడుతూ- "ఫైబర్-సేవను దేశం కోసం అంకితం చేయబడింది. అన్ని ఫైబర్-సంబంధిత సేవలు ఆరోజున (రాష్ట్రపతి ప్రారంభించాక) అంకితం చేయబడతాయి" అన్నారు. "ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఫైబర్ 3,30,000 గృహాల ద్వారా 24,000 కి.మీ దూరంలో ప్రయాణించనుంది. ఇది 1.5 గంటలలో 12 మిలియన్ల గృహాలను కలుపుతుంది. ఈ కనెక్షన్ 1.1 లక్షల గృహాలకు అందుబాటులో ఉంటుంది" అని బాబు అన్నారు. 

రాష్ట్రపతి రాష్ట్ర ఆర్టీజి సెంటర్ ను కూడా సందర్శిస్తారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల వాస్తవిక తనిఖీని చేస్తారు. డ్వాక్రా మహిళలతో  వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంభాహిస్తారు. 

Trending News