జనసేన పార్టీకి జిల్లా ఇంఛార్జులొచ్చారు

తాజాగా చేపట్టిన నియామకాల్లోనూ ఏపీలోని పలు జిల్లాలకే ఇంచార్జ్‌ల నియామక ప్రక్రియను పూర్తిచేశారు. జనసేన పార్టీ తరపున జిల్లాల ఇంచార్జులుగా

Last Updated : Mar 29, 2018, 08:21 PM IST
జనసేన పార్టీకి జిల్లా ఇంఛార్జులొచ్చారు

జనసేన పార్టీని గ్రామీణ స్థాయిలో పరిపుష్టం చేసేందుకు ఎప్పటినుంచో చర్యలు చేపట్టిన ఆ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఎట్టకేలకు ఏపీలోని పలు జిల్లాలకు పార్టీ ఇంఛార్జులని నియమించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌కి అభిమానులు, జనసేన పార్టీకి మద్ధతుదారులు వున్నప్పటికీ.. పవన్ మాత్రం ప్రత్యేకంగా ఏపీపైనే దృష్టి సారించారని తెలుస్తోంది. అందువల్లే తాజాగా చేపట్టిన నియామకాల్లోనూ ఏపీలోని పలు జిల్లాలకే ఇంచార్జ్‌ల నియామక ప్రక్రియను పూర్తిచేశారు. జనసేన పార్టీ తరపున జిల్లాల ఇంచార్జులుగా నియామకమైన వారిలో   రియాజ్ (ప్రకాశం జిల్లా)‌, శంకర్ గౌడ్ (తూర్పు గోదావరి జిల్లా)‌, అశోక్‌ ( రాయలసీమ జిల్లాల ఇంచార్జ్‌)  ఉన్నారు. రెండో దశ నియామకాల్లో ఇంకొంత మందికి చోటు లభించే అకాశం ఉందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
ఈమధ్యే కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేన పార్టీలో చేరిన సీనియర్‌ నాయకుడు, పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరంను పవన్ కల్యాన్ పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు ఎమ్మెల్సీగా, అందులో ఓసారి పోలీసు హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌గా పని చేసిన అనుభవం మాదాసు గంగాధరం సొంతం.

 

Trending News