Heavy Rains: వాయుగుండం.. 3 రోజులు భారీ వర్షాలు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండి హెచ్చరిక..

Heavy Rains In Ap: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోతుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండి తీవ్ర హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనలు ఏర్పడుతున్నాయి ఈ సందర్భంగా ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల పాటు తమిళనాడు, ఒరిస్సా వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి.  

2 /5

అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 27, 28, 29 తేదీలు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి.  

3 /5

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయి. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

4 /5

 ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండంగా మారనుంది. ఇది ముఖ్యంగా ఏపీలోని ప్రాంతాల ప్రభావితం చూపిస్తుందో తెలంగాణలో కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది.  

5 /5

తెలుగు రాష్ట్రాల్లో చల్లి తీవ్రత కూడా పెరిగిపోతుంది రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి పగలు సాధారణంగా నమోదు అవుతున్నాయి. వృద్ధులు, పిల్లలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ చెప్పింది. లేకపోతే సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x