Ayodhaya Ram Lalla: అయోధ్యలో భక్తులు తప్పక చూడాల్సిన టాప్ ఫైవ్ ప్రదేశాల వివరాలు ...

Ayodhya: వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రామజన్మభూమిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభంగా జరిగింది. రాముడిని దర్శించుకొవడానికి భక్తులు పొటెత్తుతున్నారు.

1 /6

అయోధ్యలో బాలరాముడితో దర్శనంతో పాటు, భక్తులు తప్పకుండా చూడాల్సిన మరికొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదట భక్తులు రామ్ లల్లా మర్యాద పురుషోత్తముడిని విగ్రహాన్ని దర్శించుకోవాలి.  

2 /6

హనుమాన్ గర్హి అనే ప్రదేశం అక్కడ కొండపైన ఉంటుంది. హనుమంతుడు ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్నాడని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ హనుమాన్ పాలకుడిగా ఉంటారు.   

3 /6

కనక్ భవన్ ఆలయం హనుమాన్ గర్హి టెంపుల్ కు దగ్గరలో ఉంది. కనక్ భవన్ ను భక్తులు సోనేకా మందరం అని కూడా అంటారు. ఇక్కడ శ్రీరాముడు, సీతామాతలు కలిసి ఉన్నారని చెబుతుంటారు.  

4 /6

నాగేశ్వర నాథ్ ఆలయం ఆలయం పన్నేండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పౌరాణిక, త్రేతా యుగానికి ముందు ఇక్కడ శివుడు వెలిశాడని చెబుతుంటారు. ఇక్కడ శివలింగం ప్రకాశిస్తూ ఉంటుంది. లవకుశులు ఈ ఆలయం నిర్మించారనిచెబుతారు. 25 అడుగులు ఎత్తైన శిఖరం ఉంది.

5 /6

తులసి స్యారక భవన్ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మధ్య యుగానికి చెందిన కవి గోస్వామి తులసీ దాస్ రామచరిత మానస్ ను రచించాడని చెబుతారు. ఇక్కడ రాముడి కాలంలోని అనేక సంఘటనల గ్యాలరీలు ఉన్నాయి.

6 /6

అయోధ్య భవ్యరామమందిరంను కులమతాలకు అతీతంగా అందరు దర్శించుకుంటున్నారు. ప్రతిరోజు కూడా వేలాదిగా భక్తులు వస్తునే ఉన్నారు. వందల ఏళ్ల నాటి కల ప్రధాని మోదీ చేతుల మీదుగా నెరవేరినందుకు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x