VVIPs Visits Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి బుధవారం ప్రముఖులు బారులు తీరారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటి రవళి, సంగీత దర్శకుడు తమన్, హీరోలు ఆది సాయికుమార్, అశ్విన్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన వారితో ఫొటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు.
Mysore Rajamatha Donates 100 Kg Akhanda Lamps To Tirumala Know The 300 Years History: తిరుమల శ్రీవారి మైసూరు రాజ కుటుంబం భారీ కానుక అందించింది. వందల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని రాజ కుటుంబం పాటించి తిరుమల శ్రీవారికి వంద కిలోల కానుక అందించడం విశేషం. ఆ కానుక వెనుక చరిత్ర ఏమిటో తెలుసా?
Mysore Rajamatha Donates 100 Kg Akhanda Lamps: మైసూర్ సంస్థాన రాజమాత ప్రమోదాదేవి, మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడియార్ కుటుంబంతో కలిసి ఉదయం నైవేద్య విరామంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులుస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయక మండపంలో వంద కిలోల వెండి అఖండ దీపాలను రాజ కుటుంబం ఆలయానికి అందించింది. ఈ సందర్భంగా అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.
August Month Tirumala Arjitha Seva Tickets: తిరుమల సందర్శించే భక్తులకు శుభవార్త. తిరుమలలోని ఆర్జిత సేవలతోపాటు వీఐపీ దర్శనం, అంగప్రదక్షిణం తదితర సేవల టికెట్లు రేపటి నుంచి విడుదల కానున్నాయి. భక్తులు త్వరపడితే టికెట్లు లభిస్తాయి.
TTD Vigilance Negligence Devotees Fight: గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. గతంలో తిరుమల రైల్వే రిజర్వేషన్ కేంద్రం వద్ద.. మొన్న ప్రధాన ద్వారం వద్ద భక్తుల మధ్య ఘర్షణ వాటిల్లగా నేడు తాజాగా నారాయణగిరి షెడ్డులో భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. జుట్లు జుట్లు పట్టుకొని మహిళా భక్తులు కొట్టుకున్నారు. వరుస సంఘటనలు జరుగుతున్న నిర్లక్ష్యంలో టీటీడీ యంత్రాంగం.
Graha Dosha Remove With These Sankatahara Chaturthi Rituals: జీవితంలో అనేక సంకటాలు, కష్టాలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఉపశమనం కలిగి రోజు వచ్చేసింది. సంకటాలను అన్నింటిని హరించే సంకటహర చతుర్థి రేపు. పెళ్లి యోగం, సంతాన ప్రాప్తి, జీవితంలో కష్టాలు తొలగిపోవాలను చూస్తున్న వారు ఏం చేయాలో తెలుసా?
Gold Theft In Tirumala: తిరుమలలో దొంగలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన బాపట్లకు చెందిన భక్తుల నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. తిరుమలలోని రాంభగిఛ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కుతున్న సమయంలో ముగ్గురు దొంగలు బంగారు గాజులు చోరీ చేశారు. దాదాపు 50 గ్రాముల బంగారు గాజులు చోరీ చేయడంతో భక్తులు లబోదిబోమన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజిలెన్స్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భగవంతుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామని ఆలయానికి వెళ్లిన భక్తులకు భారీ షాక్ తగిలింది. దర్శనం అనంతరం ప్రసాదం కొన్న తర్వాత ఆ ప్రసాదంలో పాము ప్రత్యక్షమైంది. తినేందుకు చూసిన భక్తుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అయితే ప్రసాదం డబ్బాలో కనిపించిన పాము పిల్ల చనిపోయి ఉంది. వెంటనే బెంబేలెత్తిన భక్తులు ఆందోళన చెందారు. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
Snake In Hosur Temple Prasadam: దేవాలయానికి వెళ్లి దర్శనం అనంతరం ప్రసాదం కొన్న భక్తులకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రసాదం తీసుకుని తినాలని చూడగా ప్రసాదం డబ్బాలో పాము పిల్ల ప్రత్యక్షమైంది. వెంటనే బెంబేలెత్తిన భక్తులు ఆందోళన చెందారు. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయగా ఆ సంఘటన వైరల్గా మారింది. ఇది తమిళనాడు హోసూర్లోని చంద్ర చుడేశ్వరర్ కొండ ఆలయంలో చోటుచేసుకుంది.
Badrinath: ఛార్ దామ్ యాత్రలో భాగంగా చివరిదైన శ్రీ వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటైన ‘బద్రినాథ్’ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. తాజాగా ఈ ఆదివారం బద్రినాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి.
Tirumala Guest Houses: తిరుమలలో భారీ మార్పు చోటుచేసుకుంది. అత్యధిక విరాళం ఇచ్చి వారి పేరిట భవనాలు నిర్మించిన దాతల పేర్లను టీటీడీ తొలగించింది. దాతల పేర్లను తొలగించి తిరుమల క్షేత్రం.. ఆధ్యాత్మికతకు సంబంధించిన పేర్లను భవనాలకు పెట్టారు. 42 అతిథిగృహల పేర్లను టీటీడీ బోర్డు మార్చివేసింది.
Donors Name Changed In Tirumala Guest Houses: తిరుమల భక్తులకు భారీ షాక్ తగిలింది. అత్యధిక విరాళం ఇచ్చి వారి పేరిట భవనాలు నిర్మించగా.. తాజాగా వాటి పేర్లను తొలగిస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇది సద్దుదేశంతో తీసుకున్న నిర్ణయంతో హర్షం వ్యక్తమవుతోంది.
15 Days To Go Saraswathi River Pushkar Here Full Details: తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లనుంది. రాష్ట్రంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ పుష్కరాలు ఎప్పుడు? స్నానఘట్టాలు ఎక్కడా? ఎలా వెళ్లాలి అనేది తెలుసుకుందాం. భక్తుల కోసం వివరాలు ఇలా ఉన్నాయి.
Big Alert To Devotees Heavy Rush In Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్. శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో తిరుమల కిటకిటలాడుతోంది. ఈ సమయంలో తిరుమల పర్యటన వేసుకుంటే ఇబ్బందులు పడినట్టే. కొన్ని రోజులు తిరుమల పర్యటన వాయిదా వేసుకుంటే మంచిది.
Lord Shiva Idol Opens Eyes In A Temple Vizag: ఆలయంలోని ఓ విగ్రహం కళ్లు తెరచిందనే వార్త ఒక్కసారిగా వైరల్గా మారింది. పరమశివుడు కళ్లు తెరిచాడని భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. ఇంతకీ వాస్తవమేమిటో తెలుసుకుందాం.
Lord Shiva Opens Eyes: పరమశివుడి విగ్రహం కళ్లు తెరచిందనే వార్త విశాఖపట్టణంలో వైరల్గా మారింది. విశాఖపట్టణం జిల్లా గాజువాకలోని ఆటోనగర్ యాదవ జగ్గరాజుపేట ప్రాంతంలోని శ్రీ దుర్గా నాగలింగేశ్వర ఆలయంలో శివుడు కళ్లు తెరిచాడని వార్తలు బయటకు వచ్చాయి. ఆదివారం సాయంత్రం కళ్లు తెరిచారని తెలవడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఆలయంలో పూజలు చేశారు.
Amarnath Yatra 2025 Schedule And Registration Process Details: హిమనీనదీ ప్రాంతంలో కొలువుదీరిన అమరనాథుడిని దర్శించుకునేందుకు ఏడాదిలో రెండు నెలలు మాత్రమే సమయం ఉంటుంది. మంచు కొండల్లో ఓ గుహలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Gold Ornaments Theft In Indrakiladri Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంపై భక్తురాలి కారులో దొంగతనం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఓంకారం టర్నింగ్ పాయింట్ వద్ద కారులో ఉంచిన 25 కాసులపై బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురం పెళ్లికి వెళ్తూ అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు దొంగతనం కావడంతో లబోదిబోమంటున్నారు. వన్ టౌన్ పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
Chilkur Balaji Brahmotsavam Starts: వీసాల దేవుడిగా గుర్తింపు పొందిన చిలుకూరు బాలాజీ దేవాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులోని ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి సోమవారం ప్రత్యేక పూజలు చేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం చేశారు. ఉత్సవాల సందర్భంగా వేద మంత్రోచ్ఛారణలతో ఆలయం మార్మోగింది.
Actor Akash Puri Offers Prays In Kanakadurga Temple: విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని యువ నటుడు ఆకాశ్ పూరి సందర్శించి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నాడు. అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో తన సినిమా స్క్రిప్ట్కు పూజలు చేసినట్లు తెలుస్తోంది. తాను నటించబోతున్న సినిమా కోసం విజయవాడ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.