టీమిండియా ప్రయోగం విఫలం; స్పష్టంగా కనిపించిన ధోనీ,కోహ్లీలేని లోటు

                         

Last Updated : Jan 31, 2019, 10:54 AM IST
టీమిండియా ప్రయోగం విఫలం; స్పష్టంగా కనిపించిన ధోనీ,కోహ్లీలేని లోటు

నాల్గోవన్డేలో టీమిండియా ప్రయోగం విఫలమైంది.  ధోనీ, కోహ్లీ లోటు కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. కివీస్ ఫేస్ దాటికి  టీమిండియా అమాంతంగా కుప్పకూలింది. 30.5 ఓవర్లలు మాత్రమే ఆడిన టీమిండియా  92 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాట్స్ మెన్లలలో కనీసం ఒక్కరైనా 20 పరుగుల మార్క్ ను అందుకోలేకపోయారు. ఇద్దరు అసలు పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ గా పెవీలియన్ బాటపట్టారు.

వ్యక్తిగత స్కోర్ వివరాల విషయానికి వస్తే ఓపెనర్లు రోహిత్ శర్మ 7, ధావన్ 13 పరుగులకే ఔట్ కాగా ఆ త్వర్వాత  బరిలోకి దిగిన  శుభమన్ గిల్ 9, అంబటి రాయుడు 0, దినేష్ కార్తీక్ 0, కేదార్ జాదవ్ 1, హార్దిక్ పాండ్యా 16, భువనేశ్వర్ కుమార్ 1, కులదీప్ 15, ఖలీల్ 5 పరుగులు చేయారు. చివర్లలో చాహాల్ 18 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ కు 5 వికెట్లు దక్కగా... గ్రాండ్ హోమ్ కు 3, ఆస్ట్లే, నీషామ్ లకు చెరో వికెట్ దక్కాయి. 

టీమిండియా ఉంచిన 93 పరుగుల సునాయాస లక్ష్యం చేధించేందుకు న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది.

Trending News