దక్షిణాఫ్రికాపై భారత్ జట్టు ఘన విజయం..!

ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది.

Last Updated : Feb 18, 2018, 09:54 PM IST
దక్షిణాఫ్రికాపై భారత్ జట్టు ఘన విజయం..!

ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రథమార్థంలో శిఖర్ ధావన్ ప్రళయ రుద్రుడై.. సఫారీల బౌలర్లను ఆడుకోగా.. ద్వితీయార్థంలో భువనేశ్వర్  కుమార్ చెలరేగి ఆడడంతో భారత్ విజయతీరాలను సునాయసంగా చేరింది. వాండరర్స్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సఫారీలను భారత్ 28 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాట్స్‌మన్లలో శిఖర్ ధావన్  (72; 39 బంతుల్లో 10×4, 2×6) అర్థ శతకం సాధించినా.. తక్కువ స్కోరునే (203)  భారత్ చేయడం గమనార్హం. అయితే బ్యాటింగ్ చేయడానికి దిగిన దక్షిణాఫ్రికా ఆటగాళ్ళను భువనేశ్వర్ కుమార్ (5/24 వికెట్లతో) నిలువరించడంతో మ్యాచ్ కథే మారిపోయింది. కేవలం 175 పరుగులకే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ అందరూ ఔటయ్యారు. 

Trending News