హైదరాబాదీ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచింది. కిందటేడాది ఇదే పోటీల్లో చివరి వరకు పోరాడి రన్నరప్గా నిలిచిన సైనానేహ్వాల్ ఈసారి ఫైనల్లోకి ప్రవేశించి టైటిల్ సొంతం చేసుకుంది. సైనా నేహ్వాల్, కరోలినా మారిన్ మధ్య నేడు ఫైనల్స్ జరగగా.. మోకాలి గాయం వేధించిన కారణంగా మారీన్ ఆట మధ్యలోనే పక్కకు తప్పుకుంది. దీంతో మ్యాచ్ పూర్తిగా ముగియకుండానే టైటిల్ సైనా వశమైంది.
సైనా నేహ్వాల్ 1-4తో వెనకబడి ఉన్న సమయంలో కరొలినా మారిన్ మోకాలికి గాయమైంది. గాయం వేధించడంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం కోర్టులోకి వచ్చిన మారిన్.. తొలి రౌండ్లో 10-4తో ఆధిక్యం సాధించింది. అదే సమయంలో గాయం మరోసారి వేధించడంతో కరోలినా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ ఛాంపియన్ అయిన కరొలినా మారిన్ ఇలా గాయం కారణంగా అర్థాంతరంగా వెనుదిరగాల్సి రావడంతో నిర్వాహకులు సైనా నేహ్వాల్ను విజేతగా ప్రకటించారు.