త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సైనా నెహ్వాల్..!

Last Updated : Sep 26, 2018, 11:31 AM IST
త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సైనా నెహ్వాల్..!

భారత్‌కు ఎన్నో విజయాలను అందించిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. తన సహచర ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ను సైనా పెళ్లి చేసుకోనుందని ప్రముఖ జాతీయ మీడియా తన కథనంలో వెల్లడించింది.

సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని.. సైనా, కశ్యప్ కుటుంబ సభ్యులు ఈ ప్రేమను అంగీకరించారని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ 16న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరగనుండగా.. ఈ వివాహ వేడుకకు 100 మంది హాజరుకానున్నారని తెలిపింది. డిసెంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తన కథనంలో పేర్కొంది.

2005 నుంచి పుల్లెల గోపీచంద్ వద్ద ఈ ఇద్దరు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలను గతంలో వీరిద్దరూ తిరస్కరించారు. అయితే వారు ప్రేమించుకుంటున్నట్లు గతంలో కథనాలు కూడా వచ్చాయి.   

మహిళల విభాగంలో సైనా ఉత్తమ క్రీడాకారిణి. ప్రస్తుతం కొరియా ఓపెన్‌లో ఆడుతోంది. సైనా ఖాతాలో 20 టైటిల్స్, ప్రపంచ చాంపియన్షిప్‌లో గెల్చుకున్న వెండి, ఒలింపిక్ కాంస్య పతకాలు ఉన్నాయి.

కశ్యప్ కూడా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడే. 32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత కశ్యప్ 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. 2010 కామన్వెల్త్‌లో కాంస్యము, రజత పతకాలు సాధించాడు.

ఈ ఏడాది గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తరువాత సైనా.. ఆమెను ప్రేరేపించడంలో కశ్యప్ పాత్ర గురించి మాట్లాడారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#internationalyogaday2018 👍👍

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Happy birthday to #fatpigeon 👏👌👍 ..... photo credit to @gurusaidutt 😘

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on

 

 

Trending News