T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడే రెండు జట్లు అవే.. సునీల్ గవాస్కర్ జోస్యం!

Sunil Gavaskar predicts T20 World Cup 2022 Finalists. టీ20 ప్రపంచకప్ 2022లో ఫైనల్లో తలపడే జట్లను భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేశారు. సూపర్‌-12 మ్యాచ్‌లు ఆక్టోబర్‌ 22 నుంచి ప్రారంభం కానున్నాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 18, 2022, 12:30 PM IST
  • అక్టోబర్‌ 22 నుంచి సూపర్‌-12 మ్యాచ్‌లు
  • సునీల్ గవాస్కర్ జోస్యం
  • టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడే రెండు జట్లు అవే
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడే రెండు జట్లు అవే.. సునీల్ గవాస్కర్ జోస్యం!

Sunil Gavaskar predicts India and Australia to Play T20 World Cup 2022 Final: టీ20 ప్రపంచకప్ 2022లో సంచనాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లలో మాజీ ఛాంపియన్ శ్రీలంకను పసికూన నమీబియా చిత్తు చేయగా.. రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్‌పై స్కాట్‌లాండ్‌ అనూహ్య విజయం సాధించింది. దాంతో లంక, విండీస్ జట్ల సూపర్‌-12 అవకాశాలు సన్నగిల్లాయి. పసికూనలు ఊహించని విజయాలతో సూపర్‌-12 రసవత్తరంగా మారింది. మరోవైపు సూపర్‌-12 అర్హత సాధించిన టీమ్స్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి.

సూపర్‌-12 మ్యాచ్‌లు ఆక్టోబర్‌ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో టాప్ టీమ్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. మరుసటి రోజు (ఆక్టోబర్‌ 23) చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌పై భారీ హైప్ ఏర్పడింది. మాజీలు అందరూ భారత్ గెలుస్తుందని అంచనా వేశారు. సచిన్ టెండూల్కర్ కూడా పాకిస్తాన్‌పై భారత్ విజయం సాదిస్తుందని జోస్యం చెప్పారు. ఇక భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫైనల్లో తలపడే జట్లను అంచనా వేశారు. 

భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ టామ్ మూడీ, భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాట్లాడారు. ఈ ఇద్దరు దిగ్గజాలు టీ20 ప్రపంచకప్ 2022 ఫైనలిస్టులుగా భారత్ మరియు ఆస్ట్రేలియాలను ఎంచుకున్నారు. 'భారత్ కచ్చితంగా టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ ఆడుతుంది. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియా కూడా ఫైనల్‌కు చేరుతుంది' అని సన్నీ పేర్కొన్నారు. 

టామ్ మూడీ మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, భారత్ తలపడతాయి. ఫైనల్లో  భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ఆడుతాయి' అని అన్నారు. సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు పడగొట్టడంతో  టీమిండియా 6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించిన విషయం తెలిసిందే. 

Also Read: టీ20 ప్రపంచకప్‌కు ముందు.. క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం! వార్నర్‌కు షాక్

Also Read: రాసిపెట్టుకోండి.. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్‌ను భారత్ ఓడిస్తుంది: సచిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News