హైదరాబాద్ : తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఈ నెల 27వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. 2019-20 విద్యా సంవత్సరానికి గాను మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు అర్హులని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇంటర్ రెసిడెన్షియల్ కాలేజీల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి భారీ స్పందన కనిపిస్తున్నందున దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 27వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.tswreis.in, www.tsswreisjc.cgg.gov.in వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.