Danam Nagender: అక్కడ ఉప ఎన్నిక తప్పదా..?

Danam Nagender: తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల ఉప ఎన్నికలకు కూడా దారీ తీసే అవకాశాలు ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే ఎక్కడ వస్తాయో.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Sep 12, 2024, 12:39 PM IST
Danam Nagender: అక్కడ ఉప ఎన్నిక తప్పదా..?

 

Danam Nagender: తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా..?అక్కడ ఉప ఎన్నిక తప్పదు అని పొలిటికల్ సర్కిల్  లో ప్రచారం జరుగుతుందా ..? పరిస్థితి చూస్తుంటే అలానే కనపడుతుందా....?ఉప ఎన్నిక కోసం ఆ పార్టీ సిద్దమైందా..ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఉప ఎన్నిక కోసం మానసికంగా సిద్దం చేస్తుందా.. ..ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్న ఆ పార్టీ ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతుంది..ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది..

రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వస్తుందని పొలిటికల్ సర్కిల్ జోరుగా చర్చ జరగుతుంది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా..సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉండగా ఉప ఎన్నిక ఎందుకు వస్తుందనేది మీ అనుమానం కదా ..అవునండీ అక్కడే ఉంది అసలు కథ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం బీఆర్ఎస్ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం కావడంతో దానం నాగేందర్ ఆలోచన కూడా మారింది. వెంటనే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అధికార పార్టీలో చేరిన దానం నాగేందర్ తన హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న దానం నాగేందర్ కు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల రూపంలో పెద్ద సవాల్ వచ్చి పడింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో దానం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలో నిలిచి ఓడిపోయాడు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన దానం నాగేందర్ కు ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది.

గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి చేరిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారికి రానీ సమస్య ఇప్పుడు దానం విషయంలో ఏర్పడింది. ఇప్పుడు ఇదే దానంకు పెద్ద సమస్యగా మారింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ప్రకటించాలని ఇప్పటికే బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిలో ఒక దానం నాగేందర్ మినహా మిగితా వారికి సాంకేతికంగా అనర్హతను తప్పించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో దానం నాగేందర్ కు మాత్రం చిక్కులు తప్పకపోచ్చనేది రాజకీయ పరిశీలకుల భావన.

ఇటీవల ప్రభుత్వం నియమించిన పీఏసీ ఛైర్మన్ ప్రకటన చూస్తే రాజకీయంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ఒక స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తుంది. అరికపూడి గాంధీ  బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పడంతోనే పీఏసీ ఛైర్మన్ గా ప్రకటించామని స్పీకర్ కార్యాలయం చెబుతుంది.అంటే మిగితా ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పే అవకాశం లేకపోలేదు. దీంతో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించబడుతారు. అప్పుడు వారిపై అనర్హత కూడా ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా..కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం ఇది వర్తిస్తుందా అనేది సందేహం. ఎందు కంటే దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినందున దానంపై స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతుంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇది తెలిసిన కాంగ్రెస్ పెద్దలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. హైకోర్టు కూడా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నెల రోజుల్లో నిర్ణయం ప్రకటించమని ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా  ఆలోచనలో పడింది. కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదే అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. ఖైరతాబాద్ నియోజకవర్గం విషయంలో ఎలాంటి వ్యూహాలో అమలు చేయాలో కసరత్తు ప్రారంభించింది. దానిలో భాగంగానే ఇప్పటికే దానం నాగేందర్ కు  ఇప్పటికే అటు వైపు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఉప ఎన్నికకు సిద్దంగా ఉండాల్సిందిగా దానం నాగేందర్ కు కాంగ్రెస్ అధిష్టానం చెబుతుంది. స్పీకర్ నిర్ణయానికి ముందే దానం నాగేందర్ తో రాజీనామా చేయించాలా లేక స్పీకర్ అనర్హుడిగా ప్రకటించే వరకు వేచి చూడాలా అన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఏది ఏమైనా ఉప ఎన్నికను మాత్రం ఎదుర్కోక తప్పదు అన్న భావనలో కాంగ్రెస్ ఉంది. ఉప ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలనే కృతనిశ్చయంతో ఉందని తెలుస్తుంది. దానికి అనుగుణంగానే  కాంగ్రెస్ వ్యూహాలు సిద్దం చేస్తుందని తెలుస్తుంది. అందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. వీలైనన్ని అభివృద్ది కార్యక్రమాలు ఇక నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే చేపట్టాలని రేవంత్ డిసైడ్ అయ్యారట.

మొత్తానికి ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్ నియోజకవర్గానిక ఉప ఎన్నిక వస్తుందా లేదా అనేది మాత్రం అతి కొద్ది రోజుల్లోనే తేలనుంది. ఒక వేళ ఉప ఎన్నిక అనివార్యమైతే ఇక్కడి జనాలు ఏ పార్టీనీ ఆదరిస్తారు..గెలుపు ఎవరిని వరిస్తుంది..ఉప ఎన్నిక కోసం పార్టీలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాయో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News