యాదాద్రి భువనగిరి : గ్యాంగ్స్టర్ నయీమ్ తల్లి తాహెరా బేగంను సోమవారం యాదాద్రి భువనగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ భూములు కలిగివున్న కేసులో తాహేరా బేగంను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టు పోలీసులు తెలిపారు. భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో తాహేరా బేగంపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయి. భూవివాదాలకు సంబంధించి తాహెరా బేగంపై 18 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.