కేటీఆర్‌ను ప్రసంశిస్తూ ప్రధాని మోడీ లేఖ

.

Last Updated : Sep 15, 2017, 02:35 PM IST
కేటీఆర్‌ను ప్రసంశిస్తూ ప్రధాని మోడీ లేఖ

హైదరాబాద్: స్వచ్ఛ భారత్ విషయంలో తీసుకుంటున్న చొరవను ప్రసంశిస్తూ ప్రధాని మోడీ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు లేఖ రాశారు. అక్టోబర్ 2న మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న'  స్వచ్ఛత హి సేవా ' ఉద్యమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. స్వ‌చ్ఛమైన దేశ నిర్మాణం కోసం మీరు కూడా చేయి క‌ల‌పాలంటూ మోదీ త‌న లేఖ‌లో కేటీఆర్‌ను కోరారు. ఇదే సందర్భంలో తెలంగాణ సర్కార్ చేపడుతున్న మిషన్ భగీరథ పథకాన్ని మెచ్చుకున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం విషయంలో మంత్రి కేటీఆర్ చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మంత్రి కేటీఆర్ కు లేఖ రాశారు. 

Trending News