టికెట్‌ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు: మంత్రి అజయ్

     

Last Updated : Oct 10, 2019, 09:22 AM IST
టికెట్‌ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు: మంత్రి అజయ్

తెలంగాణలోని అన్ని ఆర్టీసి డిపోల్లో గురువారం నుంచి యధావిధిగా షెడ్యూల్‌ ప్రకారమే బస్సులు నడవనున్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగానే ఆర్టీసీ అధికారులు, ఆర్డీవోలతో మంత్రి అజయ్‌ కుమార్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీసి సేవల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. 

బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై మంత్రి అజయ్ కుమార్ స్పందిస్తూ.. ప్రతీ బస్సులో టికెట్‌ ధరల పట్టిక పెడతామని, టికెట్‌ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Trending News