కేటీఆర్ సవాల్‌ని స్వీకరిస్తూనే, కేసీఆర్‌కి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో సవాల్

కేటీఆర్ సవాలుని స్వీకరిస్తూనే సీఎం కేసీఆర్‌కి మరో సవాల్ విసిరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 

Last Updated : Feb 3, 2018, 12:14 AM IST
కేటీఆర్ సవాల్‌ని స్వీకరిస్తూనే, కేసీఆర్‌కి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో సవాల్

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విసిరిన సవాలుని స్వీకరించారు. ఒకవేళ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ అధికారాన్ని ఏర్పాటు చేసినట్టయితే, తాను మాత్రమే కాకుండా తన భార్య, ప్రస్తుత కోదాడ ఎమ్మెల్యే అయిన పద్మావతి రెడ్డి ఇద్దరం రాజకీయాల నుంచి తప్పుకుంటాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే, ఇక్కడ కేటీఆర్ సవాలుని స్వీకరిస్తూనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ మెలిక పెట్టారు. ఒకవేళ 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే, ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత, కేసీఆర్‌కి మేనల్లుడు అయిన టీ హరీష్ రావు కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటామని ప్రకటించాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీకి ప్రతిసవాల్ విసిరారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌పై స్పందిస్తూ గురువారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. "తాను ఎలాగైతే వారి సవాల్‌ని స్వీకరించానో... అలాగే తాను విసిరిన సవాల్‌ని స్వీకరిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ కూడా ఓ ప్రకటన చేయాలి"అని డిమాండ్ చేశారు.

Trending News