Munugode Bypoll: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చెప్పుతో దాడి..

Munugode Bypoll:  తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనంతగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చౌటుప్పల్ మండలం జైకేసారంలో ఏకంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై దాడి జరిగింది. ప్రచారంలో భాగంగా రథంపై నుంచి కోమటిరెడ్డి ప్రసంగిస్తుండగా.. ఓ వ్యక్తి అతనిపైకి దూసుకువచ్చాడు. కోమటిరెడ్డి చేతిలోని మైకును లాగేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

  • Zee Media Bureau
  • Oct 24, 2022, 03:18 PM IST

Video ThumbnailPlay icon

Trending News