Minister Harish Rao: త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్న మంత్రి హరీష్‌రావు..!

Minister Harish Rao: సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 08:19 PM IST

Minister Harish Rao: తెలంగాణలో త్వరలో అర్హులైన వారిని కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇరుగుపల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డిలో మంచినీటి వాటర్ ట్యాంక్‌కు ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మొక్కలు నాటారు. డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. త్వరలో రూ.50 కోట్లతో మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలు, రూ.15 కోట్లతో మంచి నీటి సరఫరా అందిస్తామన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News