Pakistan: పాకిస్తాన్‌లో ఓ భర్త క్రూరత్వం.. పిల్లల ముందే భార్యను చంపి వేడి నీటిలో వేసి ఉడకబెట్టిన వైనం...

Pakistan Horrific Incident: పాకిస్తాన్‌లో ఓ భర్త క్రూరత్వం వెలుగుచూసింది. భార్యను పిల్లల ముందే చంపి ఆమె మృతదేహాన్ని అతను వేడి నీటిలో వేసి ఉడకబెట్టాడు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 15, 2022, 01:25 PM IST
  • పాకిస్తాన్‌లో దారుణ ఘటన
  • పిల్లల ముందే భర్తను చంపిన భర్త
  • భార్య మృతదేహాన్ని వేటి నీటిలో వేసి ఉడకబెట్టిన వైనం
Pakistan: పాకిస్తాన్‌లో ఓ భర్త క్రూరత్వం.. పిల్లల ముందే భార్యను చంపి వేడి నీటిలో వేసి ఉడకబెట్టిన వైనం...

Pakistan Horrific Incident: పాకిస్తాన్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి పిల్లల ముందే ఆమెను భారీ వేడి నీటి పాత్రలో వేసి ఉడకబెట్టాడు. తండ్రి భయానక చర్యకు పిల్లలు హడలిపోయారు. అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదనే కారణంతోనే ఆ వ్యక్తి ఇంతటి క్రూరత్వానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో బుధవారం (జూలై 13) ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... బజౌర్ జిల్లాకు చెందిన ఆషిక్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో వాచ్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. ఆ స్కూల్‌కి చెందిన సర్వెంట్ క్వార్టర్స్‌లో కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. ఏడెనిమిది నెలల క్రితం స్కూల్ మూతపడటంతో అతని ఉద్యోగం పోయింది. అప్పటినుంచి కుటుంబాన్ని పోషించలేక తిప్పలు పడుతున్నాడు.

ఇదే క్రమంలో బుధవారం భార్యతో గొడవపడ్డ ఆషిక్ దిండుతో ఆమె ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం భారీ వేడి నీటి పాత్రలో ఆమె మృతదేహాన్ని పడవేసి ఉడకబెట్టాడు. తండ్రి చేసిన ఈ ఘోరానికి పిల్లలు భయంతో వణికిపోయారు. ఈ ఘటన తర్వాత ఆషిక్ తన ఆరుగురు పిల్లల్లో ముగ్గురిని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

అతని 15 ఏళ్ల కుమార్తె ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం... అక్రమ సంబంధం కోసం ఆషిక్ తన భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో దాడి చేశాడు. ఇదే క్రమంలో హత్య చేసి వేడి నీటిలో వేసి ఉడకబెట్టాడు. ఘటనపై కేసు నమోదు చేశామని.. నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని స్థానిక ఎస్‌ఎస్‌పీ వెల్లడించారు. 
 

Also Read: MP Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్ కారుపై దాడి.. జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్తత

Also Read: Badrachalam Flood: భద్రాచలంలో 70 అడుగులకు చేరువలో గోదావరి నీటిమట్టం.. జలదిగ్భందంలో వందలాది గ్రామాలు.. హెలికాప్టర్ ద్వారా సహాయచర్యలు  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News