Manmohan Sigh: ఆర్థిక రూపశిల్పి.. మన్మోహన్ సింగ్ చేసిన ఈ 10 పనులు తెలుసుకుంటే సెల్యూట్ చేస్తారు

Manmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆర్థిక రూపశిల్పి ఇక లేరన్న వార్తతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 91ఏళ్ల మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పి.వి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాక 1991లో మన్మోహన్ సింగ్ ను తన మంత్రివర్గంలో చేర్చుకుని ఆర్థికశాఖను అప్పగించారు. అప్పటికి మన్మోహన్ సింగ్ లోకసభ కానీ రాజ్యసభలో కానీ సభ్యుడు కాదు. భారతఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి, దేశ ప్రగతి కోసం మన్మోహన్ సింగ్ చేసిన ఈ 10 పనులను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.   

Written by - Bhoomi | Last Updated : Dec 26, 2024, 11:33 PM IST
Manmohan Sigh: ఆర్థిక రూపశిల్పి.. మన్మోహన్ సింగ్ చేసిన ఈ 10 పనులు తెలుసుకుంటే సెల్యూట్ చేస్తారు

Manmohan Sigh: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గురువారం రాత్రి ఢిల్లీలోయి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్‌ సింగ్‌ రెండుసార్లు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. యాక్సిడెంటల్ ప్రధాని అని పిలిచినా ఊహాగానాలన్నింటినీ తారుమారు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. మన్మోహన్ సింగ్ రాజకీయ వేత్త కంటే నైపుణ్యం కలిగిన ఆర్థికవేత్తగా తనదైన ముద్ర వేశారు. తన అవగాహన, విజ్ఞతతో...దివాలా తీసిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా.. ప్రపంచానికి సరళీకరణ తలుపులు తెరిచి భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక సూపర్ పవర్‌గా మారడానికి మార్గం సుగమం చేశారు. ఆయన ఆర్థిక విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా సామాన్యుల జీవితాల్లో కూడా పెద్ద మార్పు వచ్చింది. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఆదాయం పెరిగింది. మన్మోహన్ సింగ్ విధానాలు భారతదేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా తీవ్రమైన సామాజిక, నిర్మాణాత్మక సంస్కరణలను కూడా తీసుకువచ్చాయి.మన్మోహన్ సింగ్ చేసిన ఈ 10పనులను రాబోయే తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. అవేంటో తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

1. ఆర్థిక సరళీకరణ (1991):

మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దిశలో తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దిగుమతి-ఎగుమతి విధానాన్ని సంస్కరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. దీని కారణంగా భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. ప్రజల ఆదాయం పెరిగింది. 

Also Read: K Annamalai: ప్రభుత్వం దిగిపోయేవరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై పాదరక్షల శపథం

2. MNREGA (2005): 

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను ప్రవేశపెట్టింది. దాని ప్రభావం నేడు ఎక్కువగా కనిపిస్తుంది. 

3. సమాచార హక్కు (RTI) (2005)

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది. ఇది పారదర్శకత, జవాబుదారీతనానికి హామీ ఇచ్చింది.

4. అణు ఒప్పందం (2008)

మన్మోహన్ సింగ్ 2008లో USతో చారిత్రాత్మకమైన భారతదేశం-అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు. ఇది భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి సహాయపడింది.

5. ఆధార్ పథకం (2009)

ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ హయాంలో ఆధార్ పథకం ప్రారంభించారు. 

Also Read:  Manmohan Singh:  మౌనముని.. దేశ రూపురేఖలను మార్చేసిన మేధావి..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానమిదే   

6. విద్యా హక్కు (2009)

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టాన్ని అమలు చేసింది. ఇది పిల్లలందరికీ విద్యా హక్కును విస్తరించింది.

7. భారతదేశ ఆర్థికాభివృద్ధి వేగం

ఆయన హయాంలో భారతదేశం అధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసింది. భారతదేశ GDP వృద్ధి రేటు 2004-2008 మధ్య 8% కంటే ఎక్కువగా ఉంది.

8. మహిళా రిజర్వేషన్, సాధికారత

మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

9. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి

రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మన్మోహన్ సింగ్ భారత్ నిర్మాణ్ యోజనను ప్రారంభించారు.

10. సామాజిక, ఆరోగ్య సంస్కరణలు

మన్మోహన్ సింగ్ జననీ సురక్ష యోజన  జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి పథకాలను ప్రారంభించారు. ఇది తల్లి ఆరోగ్యం, గ్రామీణ ఆరోగ్య సేవలను మెరుగుపరిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News