Ap second phase panchayat elections 2021: రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 13న, ప్రచారం పరిసమాప్తం, ఏకగ్రీవాలెన్నంటే.

Ap second phase panchayat elections 2021: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో ఇప్పుడు రెండో దశ ఎన్నికలకు సమయం  సమీపించింది. కీలకమైన ప్రచార పర్వం ముగిసింది. ఫిబ్రవరి 13వ తేదీన పోలింగ్ జరగనుంది. రెండో దశ ఏర్పాట్లపై ఎన్నికల కమీషనర్ అధికారులతో చర్చించారు.   

Last Updated : Feb 11, 2021, 10:45 PM IST
  • ఏపీ రెండో దశ పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం..ఏర్పాట్లపై సమీక్షించిన ఎస్ఈసీ, సీఎస్ , డీజీపీ
  • రెండవ దశ పంచాయితీ ఎన్నికల్లో 539 పంచాయితీలు ఏకగ్రీవం
  • ఫిబ్రవరి 13న రెండవ దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్, ఫలితాల వెల్లడి
Ap second phase panchayat elections 2021: రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 13న, ప్రచారం పరిసమాప్తం, ఏకగ్రీవాలెన్నంటే.

Ap second phase panchayat elections 2021: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో ఇప్పుడు రెండో దశ ఎన్నికలకు సమయం  సమీపించింది. కీలకమైన ప్రచార పర్వం ముగిసింది. ఫిబ్రవరి 13వ తేదీన పోలింగ్ జరగనుంది. రెండో దశ ఏర్పాట్లపై ఎన్నికల కమీషనర్ అధికారులతో చర్చించారు. 

ఏపీ పంచాయితీ ఎన్నిక ( Ap panchayat elections ) ల్లో తొలిదశ ముగిసి..రెండో దశ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో దశ పంచాయితీ ఎన్నికల్లో కీలకమైన ప్రచారపర్వం ఇవాళ్టితో ముగిసింది. ఫిబ్రవరి 13న జరగనున్న రెండో దశ పంచాయితీ ఎన్నిక ( Second phase panchayat elections ) లకు సంబంధించి 539 పంచాయితీలు, 12 వేల 605 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవాలు మినహాయించి మిగిలి 2 వేల 786 పంచాయితీలకు పోలింగ్ ఫిబ్రవరి 13 న జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec nimmagadda Ramesh kumar ) ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌ ( Dgp Gowtham sawang )లతో కలిసి చర్చించారు. 

రెండవ దశలో మొత్తం 13 జిల్లాల్లో 18 రెవిన్య డివిజన్లలోని 3 వేల 328 పంచాయితీలు, 33 వేల 570 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా..కొన్ని పంచాయితీలు, వార్డులు ఏకగ్రీవమయ్యాయి ( Unanimous ). ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 6.30 గంటల్నించి మద్యాహ్నం 3.30 గంటల వరకూ రెండవ విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల్నించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిదశలో కౌంటింగ్ నిలిచిపోయిన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో అదే రోజు రీ పోలింగ్ జరగనుంది.  రెండో విడతలో శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాలు, విజయనగరం జిల్లాలో 15 మండలాలు, విశాఖపట్నం జిల్లాలో 10 మండలాలు, తూర్పు గోదావరి జిల్లాలో 14 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మండలాలు, కృష్ణా జిల్లాలో 9 మండలాలు, గుంటూరు జిల్లాలో 11 మండలాలు, ప్రకాశం జిల్లాలో 14 మండలాలు, నెల్లూరు జిల్లాలో 10 మండలాలు, కర్నూలు జిల్లాలో 13 మండలాలు, అనంతపురం జిల్లాలో 19 మండలాలు, కడప జిల్లాలో 12 మండలాలు, చిత్తూరు జిల్లలో 17 మండలాల్లో పోలింగ్ జరగనుంది. 

Also read: Ys jagan: ఏపీ ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టిన వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News