COVID-19: ఏపీలో 24 గంటల్లో 97 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 62,123 శాంపిల్స్ ( COVID-tests ) పరీక్షించగా అందులో  10,080 మందికి కరోనావైరస్ పాజిటివ్‌ ( Coronavirus ) అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 2,17,040 మందికి చేరింది.

Last Updated : Aug 8, 2020, 07:02 PM IST
COVID-19: ఏపీలో 24 గంటల్లో  97 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 62,123 శాంపిల్స్ ( COVID-tests ) పరీక్షించగా అందులో  10,080 మందికి కరోనావైరస్ పాజిటివ్‌ ( Coronavirus ) అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 2,17,040 మందికి చేరింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో మరో 97 మంది మృతిచెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 1,939 కి చేరింది. Also read : Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కొవిడ్‌ ఆసుపత్రులు, హోమ్ క్వారంటైన్ అవుతున్న వారితో కలిపి 85,486 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. మరో 1,29,615 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో ( AP COVID-19 health bulletin ) పేర్కొన్న వివరాల ప్రకారం ఇప్పటివరకు ఏపీలో 24,24,393 కరోనా పరీక్షలు చేశారు. Also read : Employee vs Boss: బాస్ భార్యకి సెక్స్ టాయ్స్ గిఫ్టుగా పంపించిన ఉద్యోగి

Trending News