Nandamuri Balakrishna: కారంచేడులో సంక్రాంతి సందడిని డబుల్ చేసిన బాలయ్య.. గుర్రపు స్వారీతో హల్‌చల్

Balakrishna horse riding in Karamchedu: ప్రస్తుతం బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి కారంచేడులో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ సినీ, రాజకీయాలతో బిజీ బిజీగా గడిపే నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు.. అన్నీ పక్కనపెట్టి పండగ సంబరాల్లో మునిగిపోయారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 03:42 PM IST
  • కారంచేడులో సందడి చేస్తున్న బాలయ్య
  • సోదరి పురందేశ్వరి ఇంట సంక్రాంతి వేడుకలు
  • పండగ పూట గుర్రం ఎక్కి హల్‌చల్ చేసిన బాలయ్య
  • నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోలు, వీడియోలు
Nandamuri Balakrishna: కారంచేడులో సంక్రాంతి సందడిని డబుల్ చేసిన బాలయ్య.. గుర్రపు స్వారీతో హల్‌చల్

Balakrishna horse riding in Karamchedu: నందమూరి నటసింహం బాలకృష్ణ ఎక్కడ అడుగుపెడితే అక్కడ సందడే అని చెప్పాలి. ఈసారి సంక్రాంతి పండగకు బాలకృష్ణ కారంచేడు వెళ్లడంతో.. అక్కడ పండగ సందడి రెట్టింపయ్యింది. తన జోరు, హుషారుతో కారంచేడులో బాలకృష్ణ అందరినీ అలరిస్తున్నారు. పండగ పూట ఇంటి ముందుకొచ్చిన గుర్రంపై ఎక్కి కాసేపు స్వారీ చేశారు. డప్పుల మోతకు గుర్రం లయబద్దంగా కాలు కదపడం.. బాలయ్య దానిపై స్వారీ చేయడం.. గ్రామస్తులను ఆకట్టుకుంది. బాలయ్యతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా కొద్దిసేపు గుర్రపు స్వారీ చేశారు. బాలయ్యను చూసేందుకు కారంచేడు ప్రజలు పురందేశ్వరి ఇంటికి తరలివచ్చారు.

ప్రస్తుతం బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి కారంచేడులో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ సినీ, రాజకీయాలతో బిజీ బిజీగా గడిపే నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు.. అన్నీ పక్కనపెట్టి పండగ సంబరాల్లో మునిగిపోయారు. సంక్రాంతి పండగ వేళ.. ఉదయాన్నే అంతా కలిసి కారంచేడులోని స్థానిక దేవాలయానికి వెళ్లారు. అక్కడ పూజల అనంతరం తిరిగి ఇంటికి వచ్చారు. బాలకృష్ణ కుటుంబంతో పాటు ఆయన సోదరుడు జయకృష్ణ కుటుంబం, సోదరి లోకేశ్వరి, ఉమా మహేశ్వరిల కుటుంబాలు ప్రస్తుతం పురందేశ్వరి-వెంకటేశ్వరరావుల ఇంట్లో పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

బాలకృష్ణ కారంచేడులో (Balakrishna in Karamchedu) సందడి చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల పరంగా బాలయ్య జోరు ఇప్పుడు మామూలుగా లేదు. కరోనా భయాల మధ్య జనాలు థియేటర్లకు వస్తారో రారో అన్న మీమాంసను బద్దలుకొడుతూ బాలయ్య 'అఖండ' బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.130 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు. తన తదుపరి సినిమాను దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు బాలయ్య.

Also Read: UP Polls 2022 : తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఎం యోగి... పోటీ అక్కడి నుంచే..

Also Read: UP Polls: యూపీలో కొత్త రాజకీయ సమీకరణాలు.. చంద్రశేఖర్ ఆజాద్‌తో చేతులు కలపనున్న అఖిలేశ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News