చంద్రబాబు ఎందుకు జడ్జి ఎదుట ప్రమాణం చేయాల్సొచ్చిందంటే..

చంద్రబాబు ఎందుకు జడ్జి ఎదుట ప్రమాణం చేయాల్సొచ్చిందంటే..

Last Updated : Mar 23, 2019, 01:09 PM IST
చంద్రబాబు ఎందుకు జడ్జి ఎదుట ప్రమాణం చేయాల్సొచ్చిందంటే..

విజయవాడ: కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలోని 4వ అదనపు సీనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎదుట ప్రమాణం చేశారు. రానున్న ఎన్నికల్లోనూ తెలుగు దేశం అభ్యర్థులను గెలిపించుకుని మరోసారి అధికారాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోన్న చంద్రబాబు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. దీంతో చంద్రబాబు తరఫున టీడీపీ నేతలే శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అవసరమైన పత్రాలు సమర్పించి నామినేషన్ దాఖలు చేశారు. 

అయితే ఎన్నికల్లో పోటీచేస్తోన్న అభ్యర్థిగా చంద్రబాబు రిటర్నింగ్ అధికారి వద్ద ప్రమాణం చేయాల్సి ఉండగా ప్రచారంలో బిజీగా వున్న కారణంగా ఆయన అక్కడకు వెళ్లలేకపోయారు. ఈ కారణంగానే ఇవాళ ఉదయం చంద్రబాబు విజయవాడలోని 4వ అదనపు సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసి తన నామినేషన్ ప్రక్రియను పూర్తిచేశారు.

Trending News