ఫలితాల సీక్రెట్ ను పార్టీ నేతలతో పంచుకున్న చంద్రబాబు

పోలింగ్ సరళి, ఎన్నికల్లో గెలుపోటముల గురించి పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు

Last Updated : Apr 19, 2019, 08:42 PM IST
ఫలితాల సీక్రెట్ ను పార్టీ నేతలతో పంచుకున్న చంద్రబాబు

కర్నూలు, కడప జిల్లాల్లో ఎన్నికల ఫలితాల గురించి చంద్రబాబు ఆరా తీశారు. ఆయా జిల్లాల్లోని ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశమైన చంద్రబాబు పోలింగ్ సరళి, గెలుపు అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని  నాయకులు చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఫలితాల  గురించి మాట్లాడుతూ ఈ సారి వందశాతం మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని స్థానిక నేతలకు తెలిపారు.

కడప జిల్లా ఒంటమిట్టలో గురువారం నిర్వహించిన కోదండరామ స్వామి కల్యాణోత్సవానికి సీఎం హాజరయ్యారు.  ఈ ఉదయం కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. అనంతరం కర్ణాటకలోని రాయచూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళుతూ  కర్నూలు విమానాశ్రయానికి సీఎం చేరుకున్నారు. ఈ సమయంలో కర్నూలు జిల్లా నేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై సుదీర్ఘ చర్చ  జరిగింది

Trending News