SIPB: ఏపీలో రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్.. భారీగా ఉద్యోగ అవకాశాలు

Cm Jagan Meeting With SIPB: ఏపీలో భారీ పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ పచ్చ జెండా ఊపింది. మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2022, 01:58 PM IST
  • ఏపీలో భారీ పెట్టుబడులకు పచ్చ జెండా
  • స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్‌తో సీఎం జగన్ సమావేశం
  • మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
SIPB: ఏపీలో రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్.. భారీగా ఉద్యోగ అవకాశాలు

Cm Jagan Meeting With SIPB: ఆంధ్రప్రదేశ్‌లో రూ.23,985 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాంపు కార్యాలంయలో ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ అంగీకరించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది.

కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్‌కు రెండు విడతల్లో మొత్తంగా రూ.8,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొదటి విడతలో రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొదటి దశలో ఏడాదికి ఒక మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, రెండో విడతలో ఏడాదికి రెండు మిలియన్ టన్నుల స్టీల్‌  ఉత్పత్తులు.. మొత్తంగా ఏడాదికి మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తులు జరగనున్నాయి.

త్వరలో పనులు ప్రారంభం..

ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. వెనకబడ్డ రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నమన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయని చెప్పారు. తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం అన్నారు.

జేఎస్‌డబ్ల్యూ  గ్రూప్ మొత్తంగా 22 బిలియన్ డాలర్ల కంపెనీ. స్టీల్, ఎనర్జీ, తయారీ, సిమెంటు, పెయింటింగ్ రంగాల్లో ఈ కంపెనీ ఉత్పత్తులు ఉన్నాయి. ఏడాదికి 27 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులను సాధిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీగఢ్, ఒడిశాల్లో  ఫ్యాక్టరీలు ఉన్నాయి. 

 1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో రూ.6,330 కోట్లను అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పెట్టుబడి పెట్టనుంది. ప్రత్యక్షంగా 4 వేల మందికి ఉపాధి లభించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వేయి మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్ట్‌లను 2024 డిసెంబర్లో ప్రారంభించి నాలుగేళ్లలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి 4,196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.

రూ.8,855 కోట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఎర్రవరం, సోమశిల వద్ద రెండు ప్రాజెక్టులను షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. తద్వారా 2100 మెగావాట్ల ఉత్పత్తి జరగనుంది. ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టు, 900 మెగావాట్ల రెండో ప్రాజెక్ట్ సోమశిల వద్ద ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది జులైలో ప్రారంభమై విడతల వారీగా ఐదేళ్లలో అంటే డిసెంబర్ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రత్యక్షంగా 2100 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు.

Also Read: Sula Vineyards IPO: మార్కెట్‌లోకి సులా వైన్స్‌యార్డ్స్.. 40 రూపాయలతో ట్రేడ్  

Also Read: Happy Birthday Rajinikanth: రజినీకాంత్ కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం.. కారణం తెలుసా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News