ఆళ్లగడ్డలో ఉద్రిక్తత, భూమా - గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ

పోలింగ్ సందర్భంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఘర్షణ వాతావరణం నెలకొంది

Last Updated : Apr 11, 2019, 11:57 AM IST
ఆళ్లగడ్డలో ఉద్రిక్తత, భూమా - గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా అహోబిలంలో భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ  సందర్భంలో ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్, చెల్లి మౌనికకు గాయాలైనట్లు సమాచారం. తాజా ఘర్షణ వాతావరణంతో ఓటు వేసేందుకు వచ్చిన జనాలు భయాందోళనలు గురయ్యారు. 
 

ఈ ఘర్షణ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు..ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. నిర్భయంగా ఓటు వేయవచ్చని పోలీసులు అభయమిచ్చారు. ఘర్షణ  సమాచారం అందుకున్న అఖిలప్రియ హుటాహుటిన అహోబిలం చేరుకున్నారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x