విజయసాయి రెడ్డి నియామకం రద్దు చేసిన ఏపీ సర్కార్

విజయసాయి రెడ్డి నియామకం రద్దు చేసిన ఏపీ సర్కార్

Last Updated : Jul 5, 2019, 10:43 AM IST
విజయసాయి రెడ్డి నియామకం రద్దు చేసిన ఏపీ సర్కార్

అమరావతి: ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా వైఎస్సార్సీపీ ఎంపి విజయసాయి రెడ్డిని ఏపీ సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జూన్ 22న సాయంత్రం ఏపీ సర్కార్ నుంచి ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ తాజాగా ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కార్ వేరే ఉత్తర్వులు జారీచేసింది. విజయసాయి రెడ్డి ప్రస్తుతం ఎంపిగా కొనసాగుతున్నందునే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

తెలుగు దేశం పార్టీ హయాంలో ఆ పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగారు. అయితే, ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపి ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన అనంతరం ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు.

Trending News